PM Modi: విదేశాల్లో భారత పరువు తీస్తున్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పీఎం మోడీ..
- అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఫైర్..
- విదేశాల్లో కాంగ్రెస్ దేశ పరువుని తీస్తోంది..
- దేశంలో అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు. ‘‘నేటి కాంగ్రెస్లో దేశభక్తి స్పూర్తి చచ్చిపోయింది. నేటి కాంగ్రెస్లో ద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ళ భాష, వారి దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానించడం గురించి మాట్లాడటం చూడండి – ఇది ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’, ‘‘అర్బన్ నక్సల్స్’’ కి చెందినవారు నడుపుతున్న కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణేషుడి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్లో ఎలా ఉంచిందో చూశాం.’’ అని మహారాష్ట్ర వార్ధాలో జరిగిన జాతీయ ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.
Read Also: IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
కాంగ్రెస్ అంటే అబద్ధాలు, మోసం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అక్కడ రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నారని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి, అవినీతి పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమేనని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బలహీన వర్గాలను ఎదగనీయడం లేదని, కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ ఆలోచనని తొలగించిందని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు విశ్వకర్మ సోదరులను ఆదుకుని ఉంటే ఈ సమాజానికి ఎంతో సేవ చేసి ఉండేవారని అన్నారు.
మహారాష్ట్రలో గత ‘‘ మహావికాస్ అఘాడీ’’ పాలనని విమర్శించారు. పత్తి రైతుల్ని ఠాక్రే ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. మహారాష్ట్ర రైతులకు పత్తి పంటను బలంగా మార్చకుండా అప్పటి ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టి, రైతుల పేరుతో రాజకీయాలు చేసి, అవినీతికి పాల్పడిందని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ 2014లో ఏర్పడిందని, ఆ సమయంలో అమరావతిలో టెక్స్టైల్స్ పార్కు పనులు ప్రారంభమైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?