PM Modi: విదేశాల్లో భారత పరువు తీస్తున్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పీఎం మోడీ..
- అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఫైర్..
- విదేశాల్లో కాంగ్రెస్ దేశ పరువుని తీస్తోంది..
- దేశంలో అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు. ‘‘నేటి కాంగ్రెస్లో దేశభక్తి స్పూర్తి చచ్చిపోయింది. నేటి కాంగ్రెస్లో ద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ళ భాష, వారి దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానించడం గురించి మాట్లాడటం చూడండి – ఇది ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’, ‘‘అర్బన్ నక్సల్స్’’ కి చెందినవారు నడుపుతున్న కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణేషుడి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్లో ఎలా ఉంచిందో చూశాం.’’ అని మహారాష్ట్ర వార్ధాలో జరిగిన జాతీయ ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.
Read Also: IPhone 16 First Customer: తెల్లవారుజామున 4:30 నుంచే క్యూలో.. ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
కాంగ్రెస్ అంటే అబద్ధాలు, మోసం అని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అక్కడ రుణమాఫీ కోసం రైతులు తిరుగుతున్నారని అన్నారు. దేశంలో అత్యంత అవినీతి, అవినీతి పార్టీ ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమేనని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బలహీన వర్గాలను ఎదగనీయడం లేదని, కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ ఆలోచనని తొలగించిందని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు విశ్వకర్మ సోదరులను ఆదుకుని ఉంటే ఈ సమాజానికి ఎంతో సేవ చేసి ఉండేవారని అన్నారు.
మహారాష్ట్రలో గత ‘‘ మహావికాస్ అఘాడీ’’ పాలనని విమర్శించారు. పత్తి రైతుల్ని ఠాక్రే ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. మహారాష్ట్ర రైతులకు పత్తి పంటను బలంగా మార్చకుండా అప్పటి ప్రభుత్వం కష్టాల్లోకి నెట్టి, రైతుల పేరుతో రాజకీయాలు చేసి, అవినీతికి పాల్పడిందని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ 2014లో ఏర్పడిందని, ఆ సమయంలో అమరావతిలో టెక్స్టైల్స్ పార్కు పనులు ప్రారంభమైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!