Ghulam Nabi Azad: కాంగ్రెస్ నాపై క్షిపణులు ప్రయోగించింది.. నేను రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghulam Nabi Azad: కాంగ్రెస్తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ఇటీవలే ముగించుకున్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, తన మాజీ పార్టీకి చెందిన నాయకులు తనపై క్షిపణులు ప్రయోగించినప్పుడు మాత్రమే తాను రైఫిల్తో ప్రతీకారం తీర్చుకున్నానని అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని భదర్వాలో గురువారం జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ఆజాద్ మాట్లాడుతూ.. “వారు (కాంగ్రెస్) నాపై క్షిపణులను ప్రయోగించారు, నేను 303 రైఫిల్తో మాత్రమే ప్రతీకారం తీర్చుకున్నాను. వాటిని ధ్వంస చేశాను. నేను బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగిస్తే ఏమి జరిగేది?.” అని గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే, ఆయన దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. 52 ఏళ్లుగా పార్టీలో సభ్యుడిగా ఉండి, రాజీవ్గాంధీని సోదరుడిగా, ఇందిరాగాంధీని నా తల్లిగా భావిస్తున్నందున, వారిపై పదజాలం కూడా ఉపయోగించాలనే కోరిక నాకు లేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ను విడిచిపెట్టిన తర్వాత జమ్మూలో జరిగిన తన మొదటి బహిరంగ సభలో తన సొంత రాజకీయ సంస్థను ప్రారంభించనున్నట్లు ఆజాద్ ప్రకటించారు. “నేను ఇంకా నా పార్టీకి పేరు నిర్ణయించలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు పార్టీకి పేరు మరియు జెండాను నిర్ణయిస్తారు. నేను నా పార్టీకి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా హిందూస్థానీ పేరు పెడతాను” అని ఆయన అన్నారు. గులాం నబీ ఆజాద్ 2005-2008 కాలంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆగస్టు 26న, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై ఆయన పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని లేఖలో పేర్కొన్నారు.
Also Read
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
- Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
CUET UG Results 2022: సెప్టెంబర్ 15 నాటికి కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అపరిపక్వత కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవస్థను రాహులే ధ్వంసం చేసినట్లు విమర్శలు గుప్పించారు. దురదృష్టవశాత్తు రాహుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియమించారని, కానీ సంప్రదింపుల వ్యవస్థను రాహుల్ నాశనం చేసినట్లు ఆరోపించారు. రాహుల్లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ మీడియా ముందే బహిరంగంగా చింపివేసినట్లు వెల్లడించారు. సోనియా గాంధీ పార్టీ అధినేతగా ఉన్నా.. అన్ని కీలక నిర్ణయాలు మాత్రం రాహుల్ గాంధీ లేదా సెక్యూరిటీ గార్డులు, లేదా పీఏలు తీసుకుంటున్నట్లు విమర్శించారు.
తాజావార్తలు
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
-
Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
-
Haryana: ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం.. దెబ్బతిన్న వాహనం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!