Congress: చింతన్ శిబిర్ కోసం అంతా సిద్ధం… రేపటి నుంచి రాజస్థాన్ వేదికగా కాంగ్రెస్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ మళ్లీ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటోంది. అందుకు ఉదయ్ పూర్ లో జరిగే ‘ శింతన్ శిబిర్’ వేదిగా మారబోతున్న సంకేతాలు ఇస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శింతన్ శిబిర్ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కీలక నేతలు రాజస్థాన్ వెళ్తున్నారు. కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే రాజస్థాన్ ఉదయ్ పూర్ బయలుదేరారు. ఢిల్లీ నుంచి రైలు మార్గం ద్వారా రాజస్థాన్ వెళ్లనున్నారు. ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్ లో రైల్వే పోర్టర్లతో కాసేపు ముచ్చటించారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ లోని కాంగ్రెస్ సర్కార్ శింతన్ శిబిర్ కోసం ఏర్పాట్లు చేసింది.
కాగా… ఉదయ్ పూర్ లో జరిగే శింతన్ శిబిర్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ పూర్తిస్థాయిలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను వేరే వారికి అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. పార్టీలో మెజారిటీ నాయకులు కూడా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, సంస్థాగత అంశాలు ఈ ఆరు అంశాలపై తీర్మానాలను రూపొందించేందుకు సోనియా గాంధీ కమిటీలు ఏర్పాటు చేసింది.
Also Read
వీటితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతల గ్రూప్ జీ 23 సూచించినట్లు పార్లమెంటరీ బోర్డు యంత్రాంగాన్ని పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ‘ ఒకే కుటుంబం..ఒకే టికెట్’ నిబంధనలను కూడా అమలు చేయాలని మరో ప్రతిపాదన కూడా ఉంది. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై కూడా చింతన్ శిబిర్ లో తీర్మాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు తీసుకురావాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నిర్మాణం… కీలక సూచనలను ఇంటర్మ్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, కీలక నేతలకు వివరించారు.
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!