Mallikarjun Kharge: బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- బీజేపీ ఉగ్రవాదులు పార్టీ..
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్..
- ఇటీవల కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్ పార్టీ అంటూ ప్రధాని ఫైర్..
- దీనికి ప్రతిగా ఖర్గే వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల కాంగ్రెస్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇటీవల ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‘‘అర్బన్ నక్సల్స్’’ పార్టీ అని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తోసిపుచ్చారు. ‘‘మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ని అర్బన్ నక్సలైట్ పార్టీగా ముద్ర వేస్తారు. అది ఆయనకు అలవాటే. అయితే, ఆయన సొంత పార్టీ సంగతేంటి..? బీజేపీ ఉగ్రవాదుల పార్టీ, హత్యలకు పాల్పడుతోంది. ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోడీకి లేదు.’’ అని ఖర్గే అన్నారు.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
అక్టోబర్ 05న కాంగ్రెస్ని అర్బన్ నక్సల్స్ సమూహం నియంత్రిస్తోందని, ఆపార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించడానికి ప్రజలు కలిసి రావాలని ప్రధాని మోడీ కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ముందు వాషిమ్లో జరిగిన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. “మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుంది. భారతదేశం పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉందో అందరూ చూస్తున్నారు. దళితులను దళితులుగా, పేదలను పేదలుగా ఉంచాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాబట్టి, కాంగ్రెస్తో జాగ్రత్త. కాంగ్రెస్ను అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారు. ఆ పార్టీ దేశాన్ని విభజించాలనుకుంటోంది, అందుకే మనల్ని విభజించాలని చూస్తోంది. కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కుట్రను భగ్నం చేయడానికి ఐక్యంగా ఉండండి. కలిసి ఉండాల్సిన సమయం ఇదే’’ అని ప్రధాని అన్నారు.
అక్టోబర్ 09న హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచిన తర్వాత మళ్లీ అర్బన్ నక్సల్స్ అని ప్రధాని ప్రస్తావించారు. హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం దేశం మూడ్ని తెలియజేస్తుందని, కాంగ్రెస్, అర్బన్ నక్సల్స్ విద్వేషపూరిత కుట్రలకు తాము బలికాబోమని ప్రజలు నిరూపించారని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!