Himachal pradesh Results: హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress camp politics in Himachal Pradesh elections: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 150 సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు సాధించి ఏడో సారి అధికారంలోకి రానుంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలు ఉంటే 35 స్థానాలు వచ్చిన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య క్షణక్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి.
Read Also: World Richest Person: ప్రపంచ కుబేరులు.. ఫస్ట్ ప్లేస్ కోల్పోయిన ఎలాన్ మస్క్.. వివరాలు ఇవిగో..
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
దీంతో ఏమాత్రం అధిక్యత లభించిన కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే హిమాచల్ లో కూడా మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతన ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రానికి ప్రత్యేక దూతలను పంపింది. చత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ ను అక్కడి పంపింది కాంగ్రెస్ పార్టీ. ఆయనే అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఒక వేళ ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో క్యాంపు రాజకీయాలకు తెర లేపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలను రాజస్తాన్ తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫలితాలను బట్టి కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక చోటుకు రావాలని కాంగ్రెస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉండగా.. ఒకరు కాంగ్రెస్ రెబల్ ఉన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!