Himachal pradesh Results: హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress camp politics in Himachal Pradesh elections: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 150 సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు సాధించి ఏడో సారి అధికారంలోకి రానుంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 స్థానాలు ఉంటే 35 స్థానాలు వచ్చిన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య క్షణక్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి.
Read Also: World Richest Person: ప్రపంచ కుబేరులు.. ఫస్ట్ ప్లేస్ కోల్పోయిన ఎలాన్ మస్క్.. వివరాలు ఇవిగో..
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
దీంతో ఏమాత్రం అధిక్యత లభించిన కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే హిమాచల్ లో కూడా మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతన ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రానికి ప్రత్యేక దూతలను పంపింది. చత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ ను అక్కడి పంపింది కాంగ్రెస్ పార్టీ. ఆయనే అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఒక వేళ ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో క్యాంపు రాజకీయాలకు తెర లేపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలను రాజస్తాన్ తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫలితాలను బట్టి కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక చోటుకు రావాలని కాంగ్రెస్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉండగా.. ఒకరు కాంగ్రెస్ రెబల్ ఉన్నారు.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?