INDIA Bloc: దీపావళి తర్వాత కూటమిలో జ్ఞానోదయం.. తేజస్వి యాదవ్కు చిగురిస్తున్న కొత్త ఆశలు!
- దీపావళి తర్వాత కూటమిలో జ్ఞానోదయం
- తేజస్వి యాదవ్కు చిగురిస్తున్న కొత్త ఆశలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో విపక్ష కూటమి మళ్లీ కలవబోతుందా? మునుపటి స్నేహమే కొనసాగించబోతున్నారా? ఎన్నికల ముందు మాస్టర్ ప్లాన్ వేశారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవే సంకేతాలు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఏకతాటిపై ఉన్న కూటమి.. సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో చివరి నిమిషంలో ఎవరికి వారే వేరైపోయారు.
అయితే తత్వం బోధపడితే గానీ జ్ఞానోదయం రాదన్నట్టుగా దీపావళి తర్వాత ఇండియా కూటమికి మేల్కొలుపు వచ్చింది. విపక్ష కూటమి బలహీనతను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకోవడంతో రాజకీయ పండితుల హెచ్చరికలతో కూటమి అప్రమత్తమైంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది. తిరిగి కూటమిని ఏకతాటిపైకి తెచ్చేందుకు అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగారు. బుధవారం పాట్నా చేరుకున్న ఆయన.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను కలవనున్నారు.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
ఇది కూడా చదవండి: Droupadi Murmu: కేరళ పర్యటనలో రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం
తేజస్వి యాదవ్ను ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు వర్గాలు పేర్కొన్నాయి. ఇదే అంశాన్ని తేజస్వి యాదవ్తో అశోక్ గెహ్లాట్ చర్చించి.. తిరిగి కూటమిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయొచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తర్వాత మహాఘటబంధన్ నాయకులంతా ఐక్యంగానే ఉన్నారనే సందేశాన్ని బీహార్ ప్రజలకు పంపించవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Mamdani-Modi: భారత్లో కొంతమందికే చోటుంది.. దీపావళి వేడుకలో మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి విమర్శలు
ప్రస్తుతం బీహార్ ఎన్నికల పరిశీలకులుగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ను కాంగ్రెస్ నియమించింది. అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అన్ని గందరగోళాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులు చక్కదిద్దబడతాయని.. విపక్ష కూటమి ఎన్నికల్లో బలంగా పోటీ చేస్తుందని సంకేతం ఇచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు వేశారు. బుధవారం కాంగ్రెస్-ఆర్జేడీ నేతల సమావేశం తర్వాత పరిస్థితులు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నామినేషన్లు వేసిన చోట స్నేహపూర్వక పోటీ ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే చాలా చోట్ల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సమావేశం తర్వాత ఉమ్మడి మీడియా సమావేశం కూడా నిర్వహించనన్నారు. ప్రెస్మీట్ ద్వారా ఐక్యత సందేశాన్ని పంపనున్నట్లు వర్గాలు తెలిపాయి.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..