Delhi: ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్మోహన్.. సుప్రీం జడ్జిగా సిఫార్సు!
- ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్మోహన్కు పదోన్నతి
- సుప్రీం జడ్జిగా కొలీజియం సిఫార్సు!
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కొలీజియం సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 29న మన్మోహన్ ఢిల్లీ హైకోర్టు 32వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకముందు నవంబర్ 9, 2023న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ను అత్యున్నత న్యాయస్థానానికి పదోన్నతి కల్పించేందుకు ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Mulugu: ములుగు నియోజకవర్గంలో కొత్తగా మరో మండలం.. మాట నిలబెట్టుకున్న మంత్రి
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
సుప్రీంకోర్టు వర్గాల ప్రకారం… భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. కొలీజియంలోని ఇతర సభ్యులు జస్టిస్లు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, హృషికేష్ రాయ్, ఏఎస్ ఓకా సిఫార్సు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్ హిమా కోహ్లీ, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్లు పదవీ విరమణ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
మన్మోహన్ బ్యాగ్రౌండ్ ఇదే..
జస్టిస్ మన్మోహన్.. జమ్మూ మరియు కాశ్మీర్ గవర్నర్గా మరియు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేసిన ప్రముఖ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయవేత్తగా మారిన దివంగత జగ్మోహన్ కుమారుడు. సీనియర్ న్యాయవాదిగా ఉన్న జస్టిస్ మన్మోహన్ మార్చి 13, 2008న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబర్ 17, 2009న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి న్యాయ పట్టా పొందారు. తర్వాత 1987లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra CM: మహారాష్ట్ర సీఎం దేవేంద్రుడేనా..? డిప్యూటీలుగా షిండే, పవార్..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!