Massive landslides: కులులో పేక మేడల్లా కూలిన భవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive landslides: భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల మూలంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ చరియలు విరిగిభవనాలపై పడటంతో భవనాలు పేకమేడలా కూలిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొండచరియలు దేవాలయంపై పడటంతో దేవాలయంలో ఉన్న 9 మంది భక్తులు మృతి చెందారు. ఇప్పుడు మరికొన్ని కొండచరియలు విరిగిపడటంతో కులులో భవనాలు పేక మేడల్లా కూలుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కులులో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండలను ఆనుకొని నిర్మించిన భవనాలు కూడా నేలకూలాయి. భవనాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. ఈ కొండచరియలు విరిగిపడటం, భవనాలు కూలిపోవడం, వెంటనే పెద్ద మొత్తంలో దుమ్మూ, దూళి లేవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: WFI India: ప్రపంచ వేదికపై భారత్కు భారీ షాక్.. డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వం రద్దు!
Also Read
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
కులులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)తో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దిగాయి. ఈ దళాలతోపాటు స్థానిక అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కులు-మండి రహదారి దెబ్బతినడంతో కులు జిల్లాలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కులు జిల్లా నుంచి మండి వరకు ఉన్న రెండు రహదారులు ప్రభావితమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా పండోహ్ మీదుగా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైంది. రోడ్డు పనులను పునరుద్ధరించడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ప్రయత్నాలు చేస్తోంది.కులు జిల్లా నుంచి మండీని కలిపే రెండు మార్గాల్లో ప్రస్తుత వర్షాలకు నష్టం వాటిల్లిందని కులు ఎస్పీ సాక్షి వర్మ మీడియాకు తెలిపారు. పండోహ్ గుండా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైందని.. అయితే దానిని క్లియర్ చేసేందుకు పీడబ్లూడీ చురుకుగా పని చేస్తోందని తెలిపారు. గంటల తరబడి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆహారం, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. వారికి త్రాగునీరు, తినడానికి ఏమైనా అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
An important update coming from Kullu district, Himachal Pradesh. Amidst the ongoing challenges, a fresh landslide in Aani has now affected 2 more buildings. Our thoughts are with the people facing these multiple tragedies.#HimachalTragedy #HimachalPradesh pic.twitter.com/Xylo8NWwij
— Nikhil saini (@iNikhilsaini) August 24, 2023
తాజావార్తలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!