Massive landslides: కులులో పేక మేడల్లా కూలిన భవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive landslides: భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల మూలంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ చరియలు విరిగిభవనాలపై పడటంతో భవనాలు పేకమేడలా కూలిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొండచరియలు దేవాలయంపై పడటంతో దేవాలయంలో ఉన్న 9 మంది భక్తులు మృతి చెందారు. ఇప్పుడు మరికొన్ని కొండచరియలు విరిగిపడటంతో కులులో భవనాలు పేక మేడల్లా కూలుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కులులో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ కొండలను ఆనుకొని నిర్మించిన భవనాలు కూడా నేలకూలాయి. భవనాల కింద పలువురు చిక్కుకున్నారని తెలుస్తోంది. ఈ కొండచరియలు విరిగిపడటం, భవనాలు కూలిపోవడం, వెంటనే పెద్ద మొత్తంలో దుమ్మూ, దూళి లేవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: WFI India: ప్రపంచ వేదికపై భారత్కు భారీ షాక్.. డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వం రద్దు!
Also Read
కులులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్)తో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దిగాయి. ఈ దళాలతోపాటు స్థానిక అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కులు-మండి రహదారి దెబ్బతినడంతో కులు జిల్లాలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కులు జిల్లా నుంచి మండి వరకు ఉన్న రెండు రహదారులు ప్రభావితమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా పండోహ్ మీదుగా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైంది. రోడ్డు పనులను పునరుద్ధరించడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ప్రయత్నాలు చేస్తోంది.కులు జిల్లా నుంచి మండీని కలిపే రెండు మార్గాల్లో ప్రస్తుత వర్షాలకు నష్టం వాటిల్లిందని కులు ఎస్పీ సాక్షి వర్మ మీడియాకు తెలిపారు. పండోహ్ గుండా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కూడా ప్రభావితమైందని.. అయితే దానిని క్లియర్ చేసేందుకు పీడబ్లూడీ చురుకుగా పని చేస్తోందని తెలిపారు. గంటల తరబడి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆహారం, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. వారికి త్రాగునీరు, తినడానికి ఏమైనా అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
An important update coming from Kullu district, Himachal Pradesh. Amidst the ongoing challenges, a fresh landslide in Aani has now affected 2 more buildings. Our thoughts are with the people facing these multiple tragedies.#HimachalTragedy #HimachalPradesh pic.twitter.com/Xylo8NWwij
— Nikhil saini (@iNikhilsaini) August 24, 2023
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!