CM Nitish Kumar: వచ్చే ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుంది.
CM Nitish Kumar comments on BJP: ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇటీవల బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎనిమిదోసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ పై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. మణిపూర్ లో జేడీయూ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని భారీ షాక్ ఇచ్చింది.
ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడితే 2024 ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లకు దిగజారుతుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం అన్నారు. పాట్నాలో జరిగిన జేడీయూ కార్యవర్గం సమావేశంలో నితీష్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు. బీజేపీని దెబ్బతీసేందుకు నేను పనిచేస్తా అని అన్నారు. ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వారంలో నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల నేతలను కలవనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కాంగ్రెస్ నాయకులను నితీష్ కుమార్ మీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. జేడీయూ కార్యవర్గం సమావేశంలో ప్రతిపక్ష ఐక్యతపై తీర్మాణాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. దేశంలో బీజేపీ నేతృత్వంలో ‘ఎమర్జెన్సీ’ ఉందని పేర్కొంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సీఎం నితీష్ కుమార్ ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బీజేపేతర ప్రతిపక్ష పార్టీల నేతలను ఆయన కలవబోతున్నారు.
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
Read Also: Congress: “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో నేడు కాంగ్రెస్ భారీ ర్యాలీ
ఇదిలా ఉంటే జేడీయూ పార్టీపై విరుచుకుపడుతోంది బీజేపీ. బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ.. సీఎం నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడని.. కేవలం 5-10 సీట్లు ఉన్న వ్యక్తి ఎలా ప్రధాని అవుతారని ప్రశ్నించారు. పోస్టర్లు, హోర్డింగులు ప్రధానిని చేయవని నితీష్ కుమార్ కు చురకలు అంటించారు. ఇక మణిపూర్ లో జేడీయూ ఎమ్మెల్యేలు ఆరుగురు బీజేపీలో చేరడంపై కూడా రెండు పార్టీల మధ్య విభేదాలను పెంచాయి. బీజేపీ ధనబలంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని జేడీయూ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!