CM MK Stalin: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM MK Stalin: సివిల్ సర్వీస్ అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ..పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిందన్న విషయాన్ని స్టాలిన్ తన లేఖలో ప్రస్తావించారు. సివిల్ సర్వీస్ అభ్యర్థుల విన్నపాన్ని మరోసారి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను. కరోనా కారణంగా చాలా మంది సివిల్ సర్వీస్ అభ్యర్థులు తమ చివరి అవకాశాన్ని కోల్పోయారు. అందువల్ల వారందరికీ వయోపరిమితిని పెంచుతూ మరో అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు సీఎం స్టాలిన్.
Read Also: Vijayawada Traffic Restrictions: గుణదల మేరిమాత ఉత్సవాలు.. బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ఇటీవల ఎస్ఎస్సీ నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాల పోలీస్ రిక్రూట్మెంట్లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు మూడేళ్లపాటు వయోపరిమితిని పెంచిన విషయాన్ని గుర్తు చేశారు స్టాలిన్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రెగ్యులేషన్స్, 1955లోని రెగ్యులేషన్ 4ను అమలు చేయడం ద్వారా కోవిడ్-19 మహమ్మారి కారణంగా తమ చివరి ప్రయత్నాలను ముగించిన అభ్యర్థులకు సంబంధిత వయస్సు సడలింపుకు సంబంధించిన డిమాండ్. ఇది ఒక్కసారి సడలింపు మరియు ఇది ఖజానాపై ఎటువంటి ద్రవ్య భారాన్ని కలిగించదు, అయితే అదే సమయంలో సివిల్ సర్వీస్లో చేరాలని ఆకాంక్షించే వేలాది మంది యువతకు భారీ అవకాశాన్ని కల్పిస్తుందన్నారు స్టాలిన్. సివిల్ సర్వీస్ ఔత్సాహికుల డిమాండ్ను సానుభూతితో పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సిఫారసు చేసిందని ముఖ్యమంత్రి తన లేఖలో ఎత్తి చూపారు. వివిధ పార్టీలకు చెందిన 150 మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఆశావహుల కారణానికి మద్దతు ఇచ్చారు అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!