Maharashtra Polls: సీఎం ఏక్నాథ్షిండే, అజిత్ పవార్ బ్యాగ్లు తనిఖీ.. సహకరించిన అగ్ర నేతలు
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల బ్యాగ్లు తనిఖీలు
- సీఎం ఏక్నాథ్షిండే..అజిత్ పవార్ బ్యాగ్లు తనిఖీ
- సహకరించిన అగ్ర నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల బ్యాగ్లు తనిఖీలు చేయడంపై పెద్ద ఎత్తున ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల అధికారులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అగ్ర నాయకుల వాహనాలను తనిఖీలు చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్ హెలిప్యాడ్ దగ్గర సీఎం ఏక్నాథ్ షిండే బ్యాగులను తనిఖీ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి బ్యాగుల తనిఖీలకు సహకరించారు. అలాగే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెలికాప్టర్ను, బ్యాగులను తనిఖీలు చేశారు. తనిఖీలకు పూర్తిగా సహకరించినట్లు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి సహకరిస్తామన్నారు.

Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
సీఏం ఏక్నాథ్ షిండే బుధవారం పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్కు తన హెలికాప్టర్తో వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు హెలికాప్టర్లో ఉన్న ఏక్నాథ్ షిండే వ్యక్తిగత స్కూట్కేసును పరిశీలించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న షిండే వ్యక్తి గత సిబ్బంది సూట్కేసులో దుస్తులు తప్ప ఏమిలేవని చెబుతుండగా.. మధ్యలో షిండే జోక్యం చేసుకుని వారి డ్యూటిని వారిని చేయనివ్వండి అంటూ ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చారు. దీంతో షిండే సూట్కేసును పరిశీలించగా అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అలాగే హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్యాగును కూడా ఎన్నికల అధికారులు చెక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి.
ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు, బ్యాగులు మాత్రమే పరిశీలిస్తున్నారని, అధికార కూటమి నేతల విషయంలో నిబంధనలు అమలు చేయడం లేదని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బ్యాగులు తనిఖీలు చేశారు.
#WATCH | Maharashtra: CM Eknath Shinde’s bags were checked at Palghar Police ground helipad where he reached for the election campaign.
(Source: Shiv Sena) pic.twitter.com/44CnWiTYzG
— ANI (@ANI) November 13, 2024
#WATCH | Maharashtra Dy CM Ajit Pawar tweets, "Today, while on my way for election campaigning, the Election Commission conducted a routine check of my bags and helicopter. I fully cooperate and believe that such measures are essential to ensure free and fair elections. Let us… pic.twitter.com/KbL9lVnNTh
— ANI (@ANI) November 13, 2024
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!