Delhi: ఢిల్లీలో రచ్చకెక్కిన కర్ణాటక పంచాయితీ.. కొట్టుకున్న సిద్ధరామయ్య-శివకుమార్ ఆఫీసర్లు
- ఢిల్లీలో రచ్చకెక్కిన కర్ణాటక పంచాయితీ
- కొట్టుకున్న సిద్ధరామయ్య-శివకుమార్ ఆఫీసర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో అధికార మార్పిడిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి మార్పులేదని సిద్ధరామయ్య అంటున్నా.. మార్పు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అంటూ డీకే.శివకుమార్ వర్గీయులు అంటున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తాజాగా ఈ పంచాయితీ ఢిల్లీలో కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Priyanka Jawalkar : జోరు వాన ఓ వైపు.. ప్రియాంక అందాల వేడి మరోవైపు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
జూలై22న ఢిల్లీలోని కర్ణాటక భవన్లో ఇద్దరు సీనియర్ కర్ణాటక ప్రభుత్వాధికారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (ఎస్డిఓ) మోహన్ కుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఎస్డిఓ హెచ్ ఆంజనేయ మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది. అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (SDO) మోహన్ కుమార్ తనపై దాడి చేశారని హెచ్ ఆంజనేయ ఆరోపించారు. ప్రమీల అనే సీనియర్ అధికారి సహా ఇతర సిబ్బంది సమక్షంలో తనను షూ తీసుకుని కొడతానని బెదిరించారని ఆరోపించారు. మోహన్ కుమార్ అసభ్యకరమైన భాషను ఉపయోగించడమే కాకుండా, షూతో దాడి చేస్తానని బెదిరించారని ఆంజనేయ లిఖితపూర్వక ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు కర్ణాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ ఇమ్కోంగ్లా జమీర్, కర్ణాటక ప్రధాన కార్యదర్శి షాలిని రజనీష్లకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. మోహన్ కుమార్ వేధింపులకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, పదే పదే అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన కార్యదర్శి రజనీష్ అధికారిక విచారణకు ఆదేశించారు. రెసిడెంట్ కమిషనర్ నుంచి నివేదికను కోరారు.
ఇది కూడా చదవండి: Kingdom : ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే !
ఈ పరిణామం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలిక మొదలైందని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకత్వం నియంత్రణ కోల్పోయిందని ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ తెలిపారు. రెండు వర్గాలు బహిరంగంగానే కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులే కొట్టుకుంటే.. ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని ధ్వజమెత్తారు.

తాజావార్తలు
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!