Delhi: ఢిల్లీలో రచ్చకెక్కిన కర్ణాటక పంచాయితీ.. కొట్టుకున్న సిద్ధరామయ్య-శివకుమార్ ఆఫీసర్లు
- ఢిల్లీలో రచ్చకెక్కిన కర్ణాటక పంచాయితీ
- కొట్టుకున్న సిద్ధరామయ్య-శివకుమార్ ఆఫీసర్లు
కర్ణాటకలో అధికార మార్పిడిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి మార్పులేదని సిద్ధరామయ్య అంటున్నా.. మార్పు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అంటూ డీకే.శివకుమార్ వర్గీయులు అంటున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. తాజాగా ఈ పంచాయితీ ఢిల్లీలో కొట్టుకునే స్థాయికి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Priyanka Jawalkar : జోరు వాన ఓ వైపు.. ప్రియాంక అందాల వేడి మరోవైపు
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
జూలై22న ఢిల్లీలోని కర్ణాటక భవన్లో ఇద్దరు సీనియర్ కర్ణాటక ప్రభుత్వాధికారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సిద్ధరామయ్య స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (ఎస్డిఓ) మోహన్ కుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఎస్డిఓ హెచ్ ఆంజనేయ మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది. అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ (SDO) మోహన్ కుమార్ తనపై దాడి చేశారని హెచ్ ఆంజనేయ ఆరోపించారు. ప్రమీల అనే సీనియర్ అధికారి సహా ఇతర సిబ్బంది సమక్షంలో తనను షూ తీసుకుని కొడతానని బెదిరించారని ఆరోపించారు. మోహన్ కుమార్ అసభ్యకరమైన భాషను ఉపయోగించడమే కాకుండా, షూతో దాడి చేస్తానని బెదిరించారని ఆంజనేయ లిఖితపూర్వక ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు కర్ణాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ ఇమ్కోంగ్లా జమీర్, కర్ణాటక ప్రధాన కార్యదర్శి షాలిని రజనీష్లకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. మోహన్ కుమార్ వేధింపులకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, పదే పదే అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన కార్యదర్శి రజనీష్ అధికారిక విచారణకు ఆదేశించారు. రెసిడెంట్ కమిషనర్ నుంచి నివేదికను కోరారు.
ఇది కూడా చదవండి: Kingdom : ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే !
ఈ పరిణామం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలిక మొదలైందని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకత్వం నియంత్రణ కోల్పోయిందని ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ తెలిపారు. రెండు వర్గాలు బహిరంగంగానే కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులే కొట్టుకుంటే.. ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని ధ్వజమెత్తారు.

తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!