D.Y. Chandrachud: తర్వాతి సీజేఐగా డీవై చంద్రచూడ్.. కేంద్రానికి సూచించిన సీజేఐ లలిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI UU Lalit recommends Justice D Y Chandrachud as next Chief Justice of India: భారత 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ తన వారసుడిగా కేంద్రానికి పేరును సూచించారు. దీనిపై కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ లలిత్ లేఖ రాయనున్నారు. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేయనుండటంతో ఈ మేరకు కేంద్రం తదుపరి సీజేఐ పేరును సూచించాలని లేఖ రాసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో ఎక్కువ సీనియారిటీ ఉన్నవారిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకుంటారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో డీవై చంద్రచూడ్ సీనియర్ గా ఉన్నారు.
Read Also: School Girl Marriage At Bus Stop: బస్టాండ్లోనే స్కూల్ విద్యార్థినికి తాళి కట్టేశాడు.. అంతా షాక్..
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
నవంబర్ 9న డీవై చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోనున్నారు. దాదాపుగా 2 ఏళ్లు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2024 నవంబర్ 10 రిటైర్ కానున్నారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు చంద్రచూడ్. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. 1986లో హార్వర్డ్ లో జ్యూడిషియరీ సైన్స్ లో డాక్టరేట్ పూర్తి చేశారు. చంద్రచూడ్ గతంలో అలహాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ లీగర్ సర్వీస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
గత ఆగస్టులో సీజేఐగా పదవీ బాధ్యతలు తీసుకున్న జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. దాదాపుగా 74 రోజుల పాటు ఆయన సీజేఐగా పనిచేయనున్నారు. గతం వారం తన వారసుడి పేరును సూచించాలని కేంద్ర న్యాయశాఖ సీజేఐ జస్టిస్ లలిత్ కు లేఖ రాసింది. కాగా జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సుప్రీంకోర్టు 16వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన గతంలో 1978-85 వరకు ఏడేళ్లపాటు సీజేఐగా పనిచేశారు. దీంతో సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా ఆయన కుమారుడు సీజేఐగా కానున్నారు.
తాజావార్తలు
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!