D.Y. Chandrachud: తర్వాతి సీజేఐగా డీవై చంద్రచూడ్.. కేంద్రానికి సూచించిన సీజేఐ లలిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI UU Lalit recommends Justice D Y Chandrachud as next Chief Justice of India: భారత 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ తన వారసుడిగా కేంద్రానికి పేరును సూచించారు. దీనిపై కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ లలిత్ లేఖ రాయనున్నారు. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేయనుండటంతో ఈ మేరకు కేంద్రం తదుపరి సీజేఐ పేరును సూచించాలని లేఖ రాసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో ఎక్కువ సీనియారిటీ ఉన్నవారిని తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకుంటారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో డీవై చంద్రచూడ్ సీనియర్ గా ఉన్నారు.
Read Also: School Girl Marriage At Bus Stop: బస్టాండ్లోనే స్కూల్ విద్యార్థినికి తాళి కట్టేశాడు.. అంతా షాక్..
Also Read
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్పై కీలక విషయాలు
నవంబర్ 9న డీవై చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోనున్నారు. దాదాపుగా 2 ఏళ్లు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2024 నవంబర్ 10 రిటైర్ కానున్నారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు చంద్రచూడ్. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. 1986లో హార్వర్డ్ లో జ్యూడిషియరీ సైన్స్ లో డాక్టరేట్ పూర్తి చేశారు. చంద్రచూడ్ గతంలో అలహాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ లీగర్ సర్వీస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
గత ఆగస్టులో సీజేఐగా పదవీ బాధ్యతలు తీసుకున్న జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. దాదాపుగా 74 రోజుల పాటు ఆయన సీజేఐగా పనిచేయనున్నారు. గతం వారం తన వారసుడి పేరును సూచించాలని కేంద్ర న్యాయశాఖ సీజేఐ జస్టిస్ లలిత్ కు లేఖ రాసింది. కాగా జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సుప్రీంకోర్టు 16వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన గతంలో 1978-85 వరకు ఏడేళ్లపాటు సీజేఐగా పనిచేశారు. దీంతో సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా ఆయన కుమారుడు సీజేఐగా కానున్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!