CJI NV Ramana: నేడు సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI NV Ramana retires today: భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ)గా ఎన్వీ రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24, 2021లో బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 26, 2022న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా చివరి రోజు పలు హై ప్రొఫైల్ కేసులును విచారించారు. గురువారం రోజు పెగాసస్ స్పైవేర్ కేసుతో పాటు, ఇటీవల బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేసిన కేసుతో పాటు తీస్తా సెతల్వాడ్ కేసు, ప్రధానమంత్రి సెక్యురిటీ వైఫల్యం వంటి కేసులు విచారించారు.
ఎన్వీ రమణ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా గురువారం ఢిల్లీ బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పదవీ కాలలో 224 మంది న్యాయమూర్తులను పలు హైకోర్టుల్లో నియమించానని ఆయన వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకం, మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినట్లు వెల్లడించారు. 2013-14 సమయంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్ని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సుప్రీం కోొర్టులో న్యాయమూర్తులుగా ఉన్న కౌల్, ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నా, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీలు కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేయడం విశేషం. వీరంతా కూడా ఎన్వీ రమణ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
Read Also: MLA Rekha Nayak Controversy: ఎమ్మెల్యే రేఖానాయక్ హాట్ కామెంట్స్..ఆడియో వైరల్
ఢిల్లీ హైకోర్టును ఇతర హైకోర్టుతో పోల్చలేమని.. ఇక్కడ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన అనుభవం సుప్రీంకోర్టు సీజేఐ బాధ్యతలు చేపట్టడానికి ప్రారంభం వంటిదని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జీలు తమ ఛాంబర్లలో రాత్రి 7-8 గంటల వరకు కూడా పనిచేసేవారని.. కొన్ని సార్లు 9 గంటల వరకు కూడా ఇక్కడే ఉండటాన్ని చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. సాధారణంగా సాయంత్రం 4 గంటల వరకు కోర్టుల్లో ఉంటారు.. అయితే ఢిల్లీలో పనితీరు చూసి ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!