China: నేటితో ముగియనున్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China’s Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కీలకమైన 2,300 మంది హాజరయ్యారు.
ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షుడి మరోసారి జి జిన్ పింగ్ మూడోసారి బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీతో పాటు ప్రభుత్వంపై పూర్తి పట్టు ఉన్న జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో సీనియర్ అధికారులు 200 మందితో కూడిన సెంట్రల్ కమిటీని, ఇదే విధంగా 25 మందితో కూడిన పోలిట్ బ్యూరోను, అత్యంత శక్తివంతమైన ఏడుగురు సభ్యులతో కూడిన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటిని ప్రకటించనున్నారు. ఆదివారం రోజున జిన్ పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించబడతారని అంతా భావిస్తున్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
ఇది చైనా అధ్యక్షుడిగా మూడోసారి కొనసాగడానికి జిన్ పింగ్ కు అనుమతి ఇస్తుంది. మార్చిలో ప్రభుత్వ వార్షిక శాసనసభ సమావేశాల్లో జిన్ పింగ్ ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించనున్నారు. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్ పింగ్, ఒక వ్యక్తి రెండుసార్ల కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. ఆదివారం ప్రారంభంమైన కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత సమావేశాల్లో జిన్ పింగ్ దేశ ఆర్థిక పరిస్థితులు, దేశం సాధించిన విజయాలు, కోవిడ్ విధానం, విదేశీ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
తైవాన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తామని.. చైనా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని అన్నారు. తైవాన్ వేర్పాటువాదాన్ని అణిచివేస్తామని జిన్ పింగ్ ప్రకటించారు. జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. హాంగ్ కాంగ్ పై మాట్లాడారు జిన్ పింగ్.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!