China: భారత సైన్యం మోహరింపుపై చైనా చిలక పలుకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బోర్డర్లో మరింత మంది సైన్యాన్ని మోహరించింది. అయితే, ఈ పరిణామాలు డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడు పడటం లేదు. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్ మరిన్ని బలగాలను మోహరించడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉపయోగపడేది కాదని చైనా విశ్వసిస్తోదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. చైనాతో వివాదాస్పద సరిహద్దులను మరింత బలోపేతం చేసేందుకు 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.
రెండు దేశాలు గతంలో సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడానికి అంగీకరించాయి. ఇరు దేశాలు మధ్య పలుమార్లు సైనిక చర్చలు జరిగాయి. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. హిమాలయాలకు సరిహద్దుగా ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో 532 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ పశ్చిమ సరిహద్దు వద్ద 10 వేల మంది సైనికులను భారత్ మోహరించినట్లు భారత మీడియా తెలిపింది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: Sajjala: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు భారత్తో కలిసి పనిచేయడానికి చైనా కట్టుబడి ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. భారత ప్రవర్తన శాంతిని కాపాడటానికి అనుకూలంగా లేదని, ఉద్రిక్తతలను తగ్గించడానికి అనుకూలంగా లేదని ఆమె అన్నారు. సైనిక మోహరింపు ఆ ప్రాంతంలో శాంతిని కాపాడటానికి సాయం చేయదని ఆమె అన్నారు.
భారత్-చైనాలు 3800 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. చాలా చోట్ల సరిహద్దు స్పష్టంగా లేదు. 2020లో గాల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు భారత్కి చెందిన ప్రాంతాలను కూడా చైనా తమవిగా చెప్పుకుంటోంది. పలుమార్లు సరిహద్దు దాటి భారత్లోకి పీపుల్ లిజరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దళాలు ప్రవేశిస్తున్నాయి. వీరికి భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..