China: “మనం శత్రువులం కాము”.. భారత్కు చైనా సందేశం..
- మనం శత్రువులం కాదు, అవకాశాలం..
- భారత్కు డ్రాగన్ కంట్రీ చైనా సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: భారత్ పట్ల చైనా తన వైఖరిని మార్చుకుంటోంది. ఇప్పుడు స్నేహం అంటూ చిలకపలుకులు పలుకుతోంది. భారత్, చైనాలు ప్రత్యర్థులు లేదా వ్యతిరేక శక్తులు కాదని, ఒకరి అభివృద్ధికి మరొకరు ముప్పుగా కాకుండా అవకాశాలుగా నిలిచే సహాకర భాగస్వాములు అని చైనా చెప్పింది. సోమవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలతో రష్యాకు ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యల తర్వాత డ్రాగన్ కంట్రీ నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి.
భారత్, చైనాలు ‘‘సహకార భాగస్వాములు’’ అభివర్ణించిన లిన్ జియాన్, ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో సాధారణ స్థితి ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సమాచార మార్గాలు సజావుగా ఉన్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాలు రెండు దేశాలకే కాకుండా మొత్తం ఆ ప్రాంతానికి చాలా ముఖ్యమైనవి అని అన్నారు. ఇరు పక్షాల సంబంధాలు వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ఆయన తెలిపారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని చైనా చెప్పింది.
Also Read
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
రష్యా, భారత్, చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ.. మూడు వర్థమాన దేశాలని, ఈ దేశాల మైత్రి ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ప్రయోజనకరమని అన్నారు. దీనికి ముందు రష్యా అధ్యక్షుడు భారత్-చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా సున్నితమైనవిగా, బహుముఖమైనవిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య మూడో పక్షం జోక్యం చేసుకోవడం తగదని ఆయన అన్నారు. రష్యాకు రెండు దేశాలు మిత్రలే అని చెప్పారు. సరిహద్దు వివాదం వంటి సున్నితమైన అంశాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించడానికి మోడీ, జిన్ పింగ్ కృషి చేస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!