United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Puts On Hold India, US’ Move At UN To Blacklist Hafiz Saeed’s Son: లష్కరే తోయిబా చీఫ్, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కుమారుడు పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ తలా సయీద్ ను బ్లాక్లిస్ట్లో చేర్చాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా బుధవారం నిలుపుదల చేసింది. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచింది చైనా. ఈ ఏడాది ఏప్రిల్ లో భారత ప్రభుత్వం హఫీస్ తలా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 1267 ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద హఫీజ్ తలా సయీద్ ను చేర్చే ప్రతిపాదనను చైనా హోల్డ్ లో పెట్టింది. అంతకుముందు రోజు పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా నాయకుడు షాహిద్ మహమూద్ విషయంలో కూడా చైనా ఇలాగే చేసింది. హఫీజ్ తలా సయీద్ భారతదేశంలో లష్కరేతోయిబా కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిధులును సేకరిస్తున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, ఇతర పాశ్చాత్య దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు.
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
Read Also: Man turns Cooler on: ఆయన కూలర్ ఆన్ చేశాడు.. ఆమెకు కాలింది.. కట్ చేస్తే..
2016లో షాహీద్ మహమూద్ ను యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ బ్లాక్ లిస్టులో చేరింది. ప్రస్తుతం ఇతడు పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటున్నాడు. 1267 ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాకిస్తాన్ ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చాలనే ప్రతిపాదనలను చైనా అడ్డుకోవడం నాలుగు నెలల్లో ఇది ఐదోసారి. గతంలో జూన్ నెలలో పాకిస్తాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని బ్లాక్ లిస్టులో చేర్చే భారత ప్రతిపాదనను కూడా చైనా చివరి నిమిషంలో అడ్డుకుంది. ఇతడు హఫీస్ సయీద్ బావమరిది. ఆగస్టులో జైషే మహ్మద్ ఉ్గ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ ను బ్లాక్ లిస్టులో చేర్చే ప్రతిపాదను కూడా ఇలాగే చైనా నిలిపి వేసింది. ముంబై దాడి కేసులో ఇతడి ప్రమేయం కూడా ఉంది.
చివరి సారిగా మే 2019లో పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ ను ‘‘ గ్లోబర్ టెర్రరిస్టు’’గా గుర్తించడంలో భారత్ దౌత్య విజయాన్ని సాధించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉంటే చైనా మాత్రమే తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంటూ భారత ప్రయత్నాలను అడ్డుకుంటోంది. చైనాతో పాటు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..