China Dam: బ్రహ్మపుత్రపై చైనా ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్.. భారత ఆందోళనలు ఏమిటి.?
- బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్..
- చైనా డ్యామ్పై ఇండియా ఆందోళన..
- సున్నితమైన హిమాలయాల్లో నిర్మాణం..
- భవిష్యత్తులో కరువు, వరదలకు కారణమయ్యే అవకాశం..
China Dam: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పరిణామం భారత్కి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చైనా యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించింది. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్యామ్ దీనికి మూడు రెట్లు పెద్దదిగా ఉంటుందని. నాసా ప్రకారం.. త్రీగోర్జెస్ డ్యామ్ భారీ నిర్మాణం భూమి భ్రమణాన్ని ఏకంగా 0.06 సెకన్లు తగ్గించింది. అయితే, ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న కొత్త డ్యామ్ అత్యంత సున్నితమైన టిబెట్లోని హిమాలయాల్లో నిర్మిస్తోంది. ఇది భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది.
ఈ డ్యామ్ పర్యావరణంతో పాటు, అత్యధిక భూకంపాలు సంభవించే సిస్మోక్ జోన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా పెలుసుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో డ్యామ్ నిర్మించడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. టిబెన్లో యార్లంగ్ త్సాంగ్పొగా బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. దీనిపై చైనా మెగా ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని ప్రకటించిన వెంటనే, భారత్ తన అభ్యంరాలను తెలిపింది. ఈ రోజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘మా ప్రయోజనాలను కాపడుకుంటాం’’ అని చెప్పింది. నది జలాలపై భారత్ హక్కుల గురించి చైనాకు చెప్పినట్లు తెలిపింది.
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
Read Also: Syria: అస్సాద్ అరచకాలకు సాక్ష్యంగా ‘‘సైద్నాయ జైల్’’.. ఉప్పుగదులు, శ్మశానవాటికలు, శవాగారాలు..
ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న భారతదేశంపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. విపరీతమైన కరువు లేదా వరదల కారణంగా దిగువన భారత్లో ఉన్న 10 మిలియన్ల మంది ప్రభావితమవుతారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతుంది. జల విద్యుత్ ప్రాజెక్ట్ భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత్, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు గురించి చైనా ఏం చెబుతోంది..?
ఈ డ్యామ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్గా మారుతుంది. ఈ ప్రాజెక్టుని బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న టిబెటన్ పీఠభూమి తూర్పు అంచున నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చైనా14వ పంచవర్ష ప్రణాళికలో భాగం.. ప్రతీ ఏడాది 300 బిలియన్ Kwh విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రాజెక్ట్ వ్యయం 137 బిలియన్ డాలర్లుగా అంచనా. త్రీగోర్జెస్ డ్యామ్ ద్వారా చైనా 88.2 బిలియన్ kWh విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. తాజాగా నిర్మించబోయే డ్యామ్ దీనికి మూడు రెట్లు విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!