China Dam: బ్రహ్మపుత్రపై చైనా ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్.. భారత ఆందోళనలు ఏమిటి.?
- బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్..
- చైనా డ్యామ్పై ఇండియా ఆందోళన..
- సున్నితమైన హిమాలయాల్లో నిర్మాణం..
- భవిష్యత్తులో కరువు, వరదలకు కారణమయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Dam: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పరిణామం భారత్కి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చైనా యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించింది. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్యామ్ దీనికి మూడు రెట్లు పెద్దదిగా ఉంటుందని. నాసా ప్రకారం.. త్రీగోర్జెస్ డ్యామ్ భారీ నిర్మాణం భూమి భ్రమణాన్ని ఏకంగా 0.06 సెకన్లు తగ్గించింది. అయితే, ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న కొత్త డ్యామ్ అత్యంత సున్నితమైన టిబెట్లోని హిమాలయాల్లో నిర్మిస్తోంది. ఇది భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది.
ఈ డ్యామ్ పర్యావరణంతో పాటు, అత్యధిక భూకంపాలు సంభవించే సిస్మోక్ జోన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా పెలుసుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో డ్యామ్ నిర్మించడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. టిబెన్లో యార్లంగ్ త్సాంగ్పొగా బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. దీనిపై చైనా మెగా ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని ప్రకటించిన వెంటనే, భారత్ తన అభ్యంరాలను తెలిపింది. ఈ రోజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘మా ప్రయోజనాలను కాపడుకుంటాం’’ అని చెప్పింది. నది జలాలపై భారత్ హక్కుల గురించి చైనాకు చెప్పినట్లు తెలిపింది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Syria: అస్సాద్ అరచకాలకు సాక్ష్యంగా ‘‘సైద్నాయ జైల్’’.. ఉప్పుగదులు, శ్మశానవాటికలు, శవాగారాలు..
ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న భారతదేశంపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. విపరీతమైన కరువు లేదా వరదల కారణంగా దిగువన భారత్లో ఉన్న 10 మిలియన్ల మంది ప్రభావితమవుతారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతుంది. జల విద్యుత్ ప్రాజెక్ట్ భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత్, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు గురించి చైనా ఏం చెబుతోంది..?
ఈ డ్యామ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్గా మారుతుంది. ఈ ప్రాజెక్టుని బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న టిబెటన్ పీఠభూమి తూర్పు అంచున నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చైనా14వ పంచవర్ష ప్రణాళికలో భాగం.. ప్రతీ ఏడాది 300 బిలియన్ Kwh విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రాజెక్ట్ వ్యయం 137 బిలియన్ డాలర్లుగా అంచనా. త్రీగోర్జెస్ డ్యామ్ ద్వారా చైనా 88.2 బిలియన్ kWh విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. తాజాగా నిర్మించబోయే డ్యామ్ దీనికి మూడు రెట్లు విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?