China Dam: బ్రహ్మపుత్రపై చైనా ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్.. భారత ఆందోళనలు ఏమిటి.?
- బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్..
- చైనా డ్యామ్పై ఇండియా ఆందోళన..
- సున్నితమైన హిమాలయాల్లో నిర్మాణం..
- భవిష్యత్తులో కరువు, వరదలకు కారణమయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Dam: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పరిణామం భారత్కి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చైనా యాంగ్జీ నదిపై త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మించింది. ప్రస్తుతం నిర్మిస్తున్న డ్యామ్ దీనికి మూడు రెట్లు పెద్దదిగా ఉంటుందని. నాసా ప్రకారం.. త్రీగోర్జెస్ డ్యామ్ భారీ నిర్మాణం భూమి భ్రమణాన్ని ఏకంగా 0.06 సెకన్లు తగ్గించింది. అయితే, ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న కొత్త డ్యామ్ అత్యంత సున్నితమైన టిబెట్లోని హిమాలయాల్లో నిర్మిస్తోంది. ఇది భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది.
ఈ డ్యామ్ పర్యావరణంతో పాటు, అత్యధిక భూకంపాలు సంభవించే సిస్మోక్ జోన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా పెలుసుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో డ్యామ్ నిర్మించడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. టిబెన్లో యార్లంగ్ త్సాంగ్పొగా బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. దీనిపై చైనా మెగా ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని ప్రకటించిన వెంటనే, భారత్ తన అభ్యంరాలను తెలిపింది. ఈ రోజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘మా ప్రయోజనాలను కాపడుకుంటాం’’ అని చెప్పింది. నది జలాలపై భారత్ హక్కుల గురించి చైనాకు చెప్పినట్లు తెలిపింది.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Syria: అస్సాద్ అరచకాలకు సాక్ష్యంగా ‘‘సైద్నాయ జైల్’’.. ఉప్పుగదులు, శ్మశానవాటికలు, శవాగారాలు..
ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న భారతదేశంపై భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. విపరీతమైన కరువు లేదా వరదల కారణంగా దిగువన భారత్లో ఉన్న 10 మిలియన్ల మంది ప్రభావితమవుతారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతుంది. జల విద్యుత్ ప్రాజెక్ట్ భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత్, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు గురించి చైనా ఏం చెబుతోంది..?
ఈ డ్యామ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్గా మారుతుంది. ఈ ప్రాజెక్టుని బ్రహ్మపుత్ర నది దిగువన ఉన్న టిబెటన్ పీఠభూమి తూర్పు అంచున నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చైనా14వ పంచవర్ష ప్రణాళికలో భాగం.. ప్రతీ ఏడాది 300 బిలియన్ Kwh విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రాజెక్ట్ వ్యయం 137 బిలియన్ డాలర్లుగా అంచనా. త్రీగోర్జెస్ డ్యామ్ ద్వారా చైనా 88.2 బిలియన్ kWh విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. తాజాగా నిర్మించబోయే డ్యామ్ దీనికి మూడు రెట్లు విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది.
తాజావార్తలు
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!