Hydropower Dam: చైనా చేష్టలతో భారత్కు పొంచి ఉన్న మరో ముప్పు..
- ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ను నిర్మించేందుకు సిద్ధమైన చైనా..
- భారత్- చైనా సరిహద్దు వద్ద అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం!..
- ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా ఒకేసారి వాటర్ బాంబ్గా విడుదల చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydropower Dam: ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ను నిర్మించడానికి చైనా ఆమోదించింది. టిబెట్ తూర్పు అంచులో యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించబోతున్నట్లు అక్కడి న్యూస్ ఛానల్స్ లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో డ్రాగన్ కంట్రీకి చెందిన పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ పేర్కొనింది. ప్రస్తుతం చైనాలో త్రీగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్ గా ఉంది. అంటే కొత్తగా నిర్మించే జలాశయం సామర్థ్యం దానికి మూడురెట్లు అధికంగా ఉండనుందని సమాచారం.
Read Also: Potina Mahesh: కాపుల కోసం పోరాడవా?.. వంగవీటి రాధాపై పోతిన మహేష్ ఫైర్!
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
కాగా, టిబెట్లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ మీదుగా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదీ జలాల ప్రవాహతీరు, పంపిణీ లాంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్-చైనా మధ్య ఇప్పటికే ఒప్పందం కొనసాగుతుంది. వర్షాకాలంలో ఈ నదికి భారీగా వరదలు వస్తాయి. బంగ్లాదేశ్లో తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటుంది. అయితే, ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జల సంబంధిత విషయాల్ని చైనా- భారత్ పంచుకోవాల్సి ఉంటుంది.
Read Also: Delhi: ఢిల్లీ ఎన్నికలకు.. ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు..
అయితే, చైనా- భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్కు ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నారు.. కానీ, చివరి సారిగా కుదిరిన ఒప్పందం 2023లో క్లోజ్ అయింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఆ తర్వాత కొత్త ఒప్పందం చేసుకోలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా రెడీ అవుతుండటం భారత్ ను కలవరపాటుకు గురి చేస్తుంది.
Read Also: AUS vs IND: ఐసీసీ కీలక నిర్ణయం.. కోహ్లీకి భారీ జరిమానా
ఇక, చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు ప్రమాదం పొంచి ఉన్నట్లే. వేసవిలో బ్రహ్మపుత్ర నది నీటిని మళ్లించేందుకు బీజింగ్కు ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కునే ప్రమాదం ఉంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్రకి భారీగా వరదలు వస్తుంటాయి.. ఒకేసారి నీటిని కిందికి విడుదల చేస్తే.. దిగువనున్న ప్రాంతాలు ముంపుకు గురికానున్నాయి. ఈ ప్రాజెక్ట్ భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలో మీటర్ల దూరంలోనే నిర్మిస్తున్నారు. దాంతో పాటు రక్షణ పరంగానూ భారత్కు అనేక సమస్యలు వస్తాయి. ఒక వేళ యుద్ధ పరిస్థితులు వస్తే.. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా ఒకేసారి వాటర్ బాంబ్గా ఉపయోగించే అవకాశం కూడా ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!