Rahul Gandhi: చైనా, పాకిస్తాన్ కలిసి ఉన్నాయి.. భారత్పై దాడికి ప్లాన్ చేస్తున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China and Pakistan are planning to attack India together, Says Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ఇప్పుడు పాకిస్తాన్, చైనా ఇద్దరు శత్రువులు ఉన్నారని ఆయన అన్నారు. భారత్ పై దాడికి ప్లాన్ చేస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మాజీ సైనికులతో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే..ఇరు వర్గాలు నష్టపోతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత దేశం ప్రమాదంలో ఉందని ఆయన పేర్కొన్నారు. నాకు సైన్యంపై గౌరవం మాత్రమే కాదు, ప్రేమ, ఆప్యాయత ఉన్నాయని.. మీరే దేశాన్ని రక్షించాలని, మీరు లేకుండా దేశం లేదని రాహుల్ గాంధీ తెలిపారు.
మన శత్రువులు అయిన చైనా, పాకిస్తాన్లను విడిగా ఉంచడమే మా విధానం అని ఆయన తెలిపారు. ఇంతకుముందు రెండు వైపులా యుద్ధం రాని అనుకున్నాం.. కానీ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్, చైనా, ఉగ్రవాదంతో రెండున్నర వైపుల నుంచి యుద్ధం జరుగుతోందని అంటున్నారని వెల్లడించారు. చైనా, పాకిస్తాన్ సైనికంగానే కాకుండా ఆర్థికంగా కలిసి ఉన్నాయని అన్నారు. దీనికి గ్వాదర్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉదాహరణలని తెలిపారు. 2014 తర్వాత మన ఆర్థిక వ్యవస్థ మందగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కలవరం, తగాదాలు, గందరగోళం, ద్వేషాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
Read Also: Putin: పాశ్చాత్య దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
చైనా, పాకిస్తాన్ దేశాలు భారత్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు చూస్తున్నాయని అంచానా వేశారు. అందుకే ప్రభుత్వం ఏం చెప్పడం లేదని ఆరోపించారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అరుణాచల్, లడఖ్ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందున్నట్లు తెలిపారు. గల్వాన్, డోక్లామ్ ఘర్షణలు చూస్తుంటే చైనా ఏదో ప్లాన్ తో ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టాటర్ యాంగ్ట్సే ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా, భారత్ ఆర్మీల మధ్య ఘర్షణ నెలకొంది. దీనిపై రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. మన భద్రతాదళాలు చైనా ఆక్రమణను తిప్పికొట్టాయని ప్రకటించారు. అయితే దీనిపై చర్చించాలంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో చైనా సైనికులు భారత సైనికులను కొట్టారంటూ డిసెంబర్ 9న వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!