Chhattisgarh: తాను చనిపోయి కూతురును కాపాడిన తల్లి.. 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Fights Wild boar: ఎంతటి కష్టం వచ్చినా కూడా తన బిడ్డలను కాపాడుకుంటుంది అమ్మ. తన పిల్లలకు కష్టం వస్తుందంటే ఎందాకైనా పోరాడుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. తన కూతురును రక్షించుకోవడానికి 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది. చివరకు తాను ప్రాణాలు కోల్పోయి, కూతురును రక్షించుకుంది. ఈ విషాదకర సంఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో జరిగింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది ఈ ఘటన.
Read Also: Pawan Kalyan: చరణ్- ఎన్టీఆర్ ఫ్యాన్ వార్.. మధ్యలో ఇరుక్కుపోయిన పవన్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
వివరాల్లోకి వెళితే చత్తీస్ గఢ్ కోర్బా జిల్లా పసన్ అటవీ ప్రాంతంలో తేలియామర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దువ్సియా బాయి(45) తన కూతురు 11 ఏళ్ల రింకీతో కలిసి పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అడవి పందీ రింకీపై దాడి చేసింది. ఇది గమనించిన దువ్సియా బాయి కూతురుని రక్షించేందుకు అడవి పందితో వీరోచితంగా పోరాడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి కూతురును దాడి నుంచి కాపాడింది. దాదాపు 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది.
ఈ పోరాటంతో దువ్సియా బాయి, అడవి పందిని హతమార్చి తను కూడా ప్రాణాలను కోల్పోయింది. గాయాలపాలైన రింకీ గ్రామం వైపు పరుగులు తీసుకుంటూ వెళ్లి విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. గ్రామస్తులు అందించిన సమాచారంతో అటవీ, పోలీస్ శాఖలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దువ్సియా బాయి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. రింకీని చికిత్స నిమిత్తం పసన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!