Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..
- దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఛంగూర్ బాబా..
- మతమార్పిడితో సహా, ఐఎస్ఐతో లింకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ అమ్మాయిలు, మహిళలే టార్గెట్గా దేశవ్యాప్తంగా మతమార్పిడి నెట్వర్క్ని స్థాపించాడు. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, ఆ ముసుగులో అనేక అరాచకాలు చేస్తున్నాడు. ఈ కేసులో మతమార్పిడుల కోసం పలు ఇస్లామిక్ దేశాల నుంచి వందల కోట్లు నిధులను సేకరించాడు. పేద, బలహీన హిందువులను టార్గెట్ చేస్తూ, లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడి చేసేందుకు వందల కోట్ల నిధుల్ని సంపాదించాడు. వీటిపై ఇప్పుడు యూపీ అధికారులతో పాటు, ఎన్ఐఏ, ఐబీ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు
Also Read
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ఇదిలా ఉంటే, ఛంగూర్ బాబా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలను బలోపేతం చేయడానికి ఖాట్మండుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మాత మార్పిడులతో పాటు దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సోర్సెస్ ప్రకారం, ఇస్లాం మతంలోకి మారిన హిందూ మహిళలను నేపాల్లోని ఐఎస్ఐ ఏజెంట్లు, స్లీపర్ సెల్ ఆపరేటివ్స్లతో వివాహం చేయాలని ఛంగూర్ బాబా భావించాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాలతో సహా అనేక భారతీయ రాష్ట్రాలలో మత మార్పిడి నెట్వర్క్ వ్యాపించిందని ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (సౌదీ అరేబియా), ముస్లిం వరల్డ్ లీగ్, దావత్-ఎ-ఇస్లామి, ఇస్లామిక్ యూనియన్ ఆఫ్ నేపాల్ వంటి అంతర్జాతీయ ఇస్లామిక్ సంస్థలతో కూడా చంగూర్కు సంబంధాలు ఉన్నాయని చెబుతారు.
ఇటీవల పాకిస్తాన్ ఐఎస్ఐ సమావేశం ఖాట్మాండులోని పాక్ రాయబార కార్యాలంలో జరిగినట్లు సమాచారం. దీనికి పలువురు కీలక ఐఎస్ఐ అధికారులు హజరయ్యారు. పాక్ బృందం నేపాల్-భారత్ సరిహద్దు ప్రాంతాన్ని కూడా సందర్శించింది. ఇదిలా ఉంటే, ఛంగూర్ బాబా, ఉత్తర్ ప్రదేశ్లోని బర్హ్నిలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసి, రోహింగ్యా శరణార్థులను హిందువులగా చూపించి, ఆ తర్వాత మతం మార్చే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!