Chhaava: ‘‘ఛావా’’ ఔరంగజేబుపై ఆగ్రహానికి కారణం.. నాగ్పూర్ హింసపై సీఎం ఫడ్నవీస్..
- ఛావా సినిమా ఔరంగజేబుపై ఆగ్రహానికి కారణం..
- నాగ్పూర్ అల్లర్లపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు..
- కుట్రతో దాడులు చేశారన్న సీఎం, డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhaava: నాగ్పూర్ అల్లర్ల, హింస నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ‘‘ఛావా’’ సినిమాపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర తెరపైకి వచ్చిందని, ఇది మొఘల్ పాలకుడు ఔరంగజేబుపై ఆగ్రహాన్ని రేకెత్తించిందని ఆయన అన్నారు. సోమవారం రాత్రి నాగ్పూర్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ, ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛావా సినిమాను తాను నిందించాలని అనుకోవడం లేదని, ఛావా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని, దీంతో ప్రజల మనోభావాలు రగిలిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఔరంగజేబుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంతిభద్రతలను కాపాడుకోవాలని, ప్రతీ ఒక్కరూ ఓపికతో ఉండాలని, ఎవరైనా అల్లర్లు చేస్తే కులం, మతం అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్ఫ్రెండ్ దాడి..
విక్కీ కౌశల్ లీడ్రోల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ సంచలనం క్రియేట్ చేసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకి, మరాఠా రాజ్యాధినేతకు జరిగిన యుద్ధాలు, వెన్నుపోటును ఈ సినిమాలో చూపించారు. 40 రోజులకు పైగా శంభాజీని హింసించిన సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. ఈ సినిమా తర్వాత నుంచి మహారాష్ట్రలోని ఔరంగబాద్ (ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్)లో ఉన్న ఔరంగాజేబు సమాధిని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి.
మహారాష్ట్ర నుండి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్పీ మరియు బజరంగ్ దళ్ నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత హింస చెలరేగింది. మతపరమైన పవిత్ర వ్యాఖ్యలు ఉన్న వస్త్రాన్ని తగులబెట్టారనే పుకార్లు రావడంతో, ముస్లింమూక దాడులకు పాల్పడింది. నిర్దిష్ట వర్గానికి చెందిన ఇళ్లను, వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ముందస్తు ‘‘కుట్ర’’తో చేసిన దాడులుగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!