Chhaava: ‘‘ఛావా’’ ఔరంగజేబుపై ఆగ్రహానికి కారణం.. నాగ్పూర్ హింసపై సీఎం ఫడ్నవీస్..
- ఛావా సినిమా ఔరంగజేబుపై ఆగ్రహానికి కారణం..
- నాగ్పూర్ అల్లర్లపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు..
- కుట్రతో దాడులు చేశారన్న సీఎం, డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhaava: నాగ్పూర్ అల్లర్ల, హింస నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ‘‘ఛావా’’ సినిమాపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర తెరపైకి వచ్చిందని, ఇది మొఘల్ పాలకుడు ఔరంగజేబుపై ఆగ్రహాన్ని రేకెత్తించిందని ఆయన అన్నారు. సోమవారం రాత్రి నాగ్పూర్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ, ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛావా సినిమాను తాను నిందించాలని అనుకోవడం లేదని, ఛావా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని, దీంతో ప్రజల మనోభావాలు రగిలిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఔరంగజేబుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంతిభద్రతలను కాపాడుకోవాలని, ప్రతీ ఒక్కరూ ఓపికతో ఉండాలని, ఎవరైనా అల్లర్లు చేస్తే కులం, మతం అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
Read Also: Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్ఫ్రెండ్ దాడి..
విక్కీ కౌశల్ లీడ్రోల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ సంచలనం క్రియేట్ చేసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకి, మరాఠా రాజ్యాధినేతకు జరిగిన యుద్ధాలు, వెన్నుపోటును ఈ సినిమాలో చూపించారు. 40 రోజులకు పైగా శంభాజీని హింసించిన సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. ఈ సినిమా తర్వాత నుంచి మహారాష్ట్రలోని ఔరంగబాద్ (ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్)లో ఉన్న ఔరంగాజేబు సమాధిని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి.
మహారాష్ట్ర నుండి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్పీ మరియు బజరంగ్ దళ్ నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత హింస చెలరేగింది. మతపరమైన పవిత్ర వ్యాఖ్యలు ఉన్న వస్త్రాన్ని తగులబెట్టారనే పుకార్లు రావడంతో, ముస్లింమూక దాడులకు పాల్పడింది. నిర్దిష్ట వర్గానికి చెందిన ఇళ్లను, వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ముందస్తు ‘‘కుట్ర’’తో చేసిన దాడులుగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!