Chetan Sharma Resigns: స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chetan Sharma Resigns: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మపై ఓ మీడియా సంస్థ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ పెను దుమారమే రేపింది.. చివరకు ఆయన పోస్టుకు ఎసరు తెచ్చింది.. ఆ స్టింగ్ ఆపరేషన్ వివాదానికి దారి తీయడంతో.. చీఫ్ సెలక్టర్ పరదవికి రాజీనామా చేశారు చేతన్ శర్మ.. తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించారు.. మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్తో చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఆ స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ అనేక సమస్యల గురించి మాట్లాడారు.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడాడు. గత నెలలో చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్గా తిరిగి నియమించారు, అయితే, వివాదాస్పద స్టింగ్ ఆపరేషన్ అతన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. దీంతో, ఇవాళ చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జే షాకు పంపారు.
Read Also: Attack on Women: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, దుస్తులు చించివేసి..!
Also Read
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
ఇక, స్టింగ్ ఆపరేషన్లో చేతన్.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో 30 నిమిషాలు ఎలా మాట్లాడుతున్నాడో చెబుతూ పట్టుబడ్డాడు మరియు హార్దిక్ పాండ్యా తన భవిష్యత్తు గురించి చర్చించడానికి అర్థరాత్రి తన స్థానానికి వస్తాడని వెల్లడించాడు. సౌరవ్ గంగూలీ మరియు విరాట్ కోహ్లి మధ్య జరిగిన పతనం గురించి చేతన్ శర్మ సుదీర్ఘంగా మాట్లాడారు. వైట్ బాల్ ఫార్మాట్లలో తనను భారత కెప్టెన్గా తొలగించడంలో గంగూలీ పాత్ర ఉందని కోహ్లీ భావించినందున అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిని పరువు తీయాలనుకున్నాడని చేతన్ ఆరోపించాడు. అయితే, కోహ్లి చర్య వెనక్కి తగ్గిందని చేతన్ చెప్పుకొచ్చాడు.. అంతేకాదు.. కెప్టెన్సీ విషయంలో విరాట్ అబద్ధం చెప్పాడని ఈ సంభాషణలో భాగంగా చేతన్ అన్నాడు. పూర్తి ఫిట్గా లేని కొందరు భారత ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్నెస్ ఉన్నట్లు చూపించి మ్యాచ్లు ఆడుతారని చేతన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Read Also: Tamil Nadu: జవాన్ను కొట్టి చంపిన కౌన్సిలర్.. తమిళనాడులో పొలిటికల్ హీట్..
భారత క్రికెటర్లు 80 శాతం ఫిట్గా ఉన్నా సరే.. ఇంజెక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్నెస్ సాధిస్తారు. అవి నొప్పి మందులు కావు. డోప్ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకం ఉన్న మందులను వాడతారు. సరైన ప్రదర్శన చేయలేని కొందరు ఆటగాళ్లు కూడా ఈ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకముందే ఈ ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్లు ఆడించారు. అతను ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్తో లేడు అంటూ స్టింగ్ ఆపరేషన్ సంచలన విషయాలు బయటపెట్టారు చేతన్ శర్మ.. ఇక, భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గాన్ని రోహిత్ నడిపిస్తే, మరొకటి కోహ్లీ నేతృత్వంలో నడుస్తుంది. అయితే కోహ్లీ, రోహిత్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డపుడు రోహిత్ అండగా నిలిచాడు. రోహిత్, కోహ్లీ మధ్య అహం సమస్యగా మారినా.. అది అమితాబ్, ధర్మేంధ్ర మధ్య ఉన్నట్లుగానే ఉంటుందని అభివర్ణించారు.. రోహిత్, హార్దిక్ నన్ను గుడ్డిగా నమ్ముతారు. ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్ తరచుగా నన్ను కలుస్తాడు అంటూ చెప్పుకొచ్చారు.. మొత్తంగా ఆ స్టింగ్ ఆపరేషన్ వివాదాలకు దారి తీయడంతో.. చివరకు రాజీనామా చేశారు చేతన్ శర్మ.
తాజావార్తలు
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!