Char Dham : చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం
- చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం
- చార్ థామ్ జరిగిన ప్రమాదాలతో గతంలో నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలు
- పూర్తి నిబంధనలతో హెలికాప్టర్ సేవలను ప్రారంభించాలని ఆదేశించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను పునఃప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదం తెలిపింది. మాన్సూన్ విరామం అనంతరం ఈ సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. యాత్రలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్రం హెచ్చరించింది. ఇందుకోసం డీజీసీఏ, ఏఎయ్ఐ, రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ (UCADA) మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు డీజీసీఏ బృందం హెలిపాడ్లు, హెలికాప్టర్లు, ఆపరేటర్లపై సమగ్ర తనిఖీలు జరిపింది. అనంతరం భద్రతా ప్రమాణాలు పాటించాలనే నిబంధనలతో అనుమతులు మంజూరు చేసింది.
పైలట్లకు ప్రత్యేకంగా హై–ఆల్టిట్యూడ్ ఆపరేషన్ శిక్షణ ఇవ్వబడింది. భద్రతా సూచనలపై అన్ని హెలికాప్టర్ ఆపరేటర్లు, పైలట్లకు డీజీసీఏ ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించింది.
డెహ్రాడూన్ (సహస్త్రధారా) నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీనాథ్ ఆలయాలకు చార్టర్ సర్వీసులు నడుస్తాయి. గుప్తకాశి–ఫాటా–సితాపూర్ క్లస్టర్ నుంచి కేదార్కు shuttle సేవలు అందించనున్నారు. మొత్తం ఆరుగురు ఆపరేటర్లు shuttle సేవలు, ఏడుగురు ఆపరేటర్లు చార్టర్ సర్వీసులు నిర్వహించనున్నారు.
డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం పైలట్లకు రూట్ చెక్స్, పునరావృత శిక్షణ తప్పనిసరి. బరువు, సంతులనం పరిమితులు కఠినంగా అమలు చేయాలి. అదనంగా హెలిపాడ్ల వద్ద గ్రౌండ్ సిబ్బంది పెంచి, ప్రయాణికులకు భద్రతా సూచనలు అందించనున్నారు.
వాతావరణంపై రియల్ టైమ్ అప్డేట్స్ అందించేందుకు ప్రత్యేక సిస్టమ్ అమలు చేస్తున్నారు. మే–జూన్ 2025లో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదాల తర్వాత ఈసారి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
“యాత్రలో భద్రతకే అత్యధిక ప్రాధాన్యం. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణ భద్రత విషయంలో రాజీ పడబోం అని డీజీసీఏ ప్రకటించింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!