Delhi: నీటి సంక్షోభంపై అతిషి నిరాహాదీక్ష .. సీఎం కేజ్రీవాల్కి వ్యతిరేకంగా బీజేపీ నినాదాలు..
- నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి నిరాహార దీక్ష..
- అంతా బూటకమన్న బీజేపీ..
- దీక్షాస్థలిలో బీజేపీ కార్యకర్తల నిరసన..
- సీఎం కేజ్రీవాల్కి వ్యతిరేకంగా నినాదాలు..
Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి అతిషీ నిరవధిక నిరాహార దీక్షను చేప్టటారు. అయితే, ఆందోళన స్థలంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. అతిషీ నిరాహారదీక్ష అంతా బూటకమని బీజేపీ ఆరోపించింది. దక్షిణ ఢిల్లీలోని భోగత్లో శనివారం గందరగోళం ఏర్పడింది. అతిషీ చేస్తున్న నిరాహార దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది.
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
నిరసనకారులు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యమునా నదిలో ఢిల్లీకి రావాల్సిన వాటాను హర్యానా విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ మంత్రి అతిషీ శుక్రవారం నిరాహార దీక్షకు కూర్చున్నారు. ‘‘ జల్ సత్యాగ్రహా’’ పేరుతో ఆమె నిరాహార దీక్ష చేస్తోంది. హర్యానా ప్రభుత్వం, ఢిల్లీలోని ప్రజలకు ఎక్కువ నీటిని విడుదల చేసే వరకు తాను ఏమీ తిననని చెప్పారు. హర్యానా శుక్రవారం రోజు 110 మిలియన్ గ్యాలన్ల (MGD) తక్కువ నీటిని విడుదల చేసిందని అతిషి చెప్పారు. ఒక MGD నీరు 28 వేల మందికి సరిపోతుందని, 100 MGD నీరు కేవలం తక్కువగా ఉండటం వల్ల నగరంలోని 28 లక్షల మందిని నీరు అందడం లేదని చెప్పారు.
బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ.. అతిషీ నిరాహార దీక్ష అంతా బూటకమని వర్ణించారు. వారి చేతకానితనాన్ని దాచడానికి ఇది రాజకీయ నాటకమని విమర్శించారు. అతిషీ ఒక పనికిరాని నీటి మంత్రి అని ఆరోపించారు. ఢిల్లీలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఫిబ్రవరి నుంచి అందరికి తెలుసు, కానీ ఆప్ ప్రభుత్వం ఎందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!