పంజాబ్ పాలిటిక్స్.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అంతా సైలెంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే కొనసాగుతూ వచ్చాయి.. సీఎంగా ఉన్న ఓ సీనియర్ నేత పార్టీకి గుడ్బై చెప్పి వెళ్లిపోయారు.. ఇక, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. సీఎం ఓవైపు, పీసీసీ చీఫ్ మరోవైపు.. తమకు తోచినట్టు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది.. పంజాబ్ ఎన్నికలకు ముందస్తుగా సీఎం అభ్యర్ధి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని తెలిపారు రాహుల్.. అయితే, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, పంజాబ్ ప్రజలు కోరుకుంటేనే ముందస్తు ప్రకటన చేస్తామన్నారు.. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది నిర్ణయంచుకోవాల్సిందిగా పార్టీ కార్యకర్తలను కోరతామన్నారు.. సీఎం చరణ్ జిత్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిధ్దుల మధ్య కొనసాగుతున్న వైరం నేపధ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, ఇద్దరు నాయకత్వం వహించలేరు.. కేవలం ఒక్కరే అని స్పష్టం చేశారు.. ఒకరు నాయకత్వం వహిస్తే, మరొకరు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరి హృదయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉంది.. ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడబోమని ఇద్దరు నేతలు కూడా బాహాటంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఇద్దరు నేతలు.. ఆ తర్వాతనే రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి పై రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిధ్ధూ హామీ ఇచ్చారు.. ప్రస్తుత సంక్షోభం నుంచి మనల్ని గట్టెక్కించే వారెవరా అని ప్రజల మనస్సుల్లో ప్రశ్న ఉందన్న ఆయన.. దానికి మార్గం ఏమిటన్నది ప్రజల మనసుల్లో ఉన్న రెండవ ప్రశ్న అన్నారు.. ఇక, ఈ సంస్కరణలను అమలు చేసేది ఎవరన్నది ప్రజల మనసుల్లో ఉన్న మూడవ ప్రశ్న అని చెప్పిన సిద్ధు.. క్రమశిక్షణ గల ఓ సైనికుడి లా రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను అని ప్రకటించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
కాగా, మేమంతా సమష్టిగా ఉన్నాం.. మేమంతా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం పోట్లాడుకోవడం లేదు.. మేం పోరాటం అంతా తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసిందుకు మాత్రమే. అందుకోసం, అవసరమైతే, నాకు నష్టం జరిగినా పర్వాలేదు. గొంతెత్తి మాట్లాడను. కానీ, నిర్ణయాలను తీసుకునే అధికారం, స్వేఛ్చ నివ్వండి. అంతేగాని, నన్ను ఓ “షోపీస్” లాగా వాడుకోవద్దు, చూడవద్దని నిక్కచ్చిగా చెప్పేశాడు రాజకీయనాయకుడిగా మారిన క్రికెటెర్ సిద్ధు.. మరోవైపు.. ముఖ్యమంత్రి ఛన్నీ కూడా మేమంతా ఐక్యంగా ఉన్నామని చూపే ప్రయత్నం చేశారు.. తానెలాంటి పదవి కోసం పాకలాడనని స్పష్టం చేశారు.. కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలున్నాయని కేజ్రీవాల్ లాంటి పార్టీయేతరులు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నా అని సిధ్దూను ఉద్దేశించి వేడుకున్నారు ముఖ్యమంత్రి ఛన్నీ… మరి పంజాబ్ కాంగ్రెస్లో కుమ్మలాటలు ఇకనైనా ఆగుతాయేమో చూడాలి.. కాగా, ఫిబ్రవరి 14వ తేదీన పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!