New Delhi: జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు
New Delhi: జాతీయ పెన్షన్ పథకంలో మార్పులు తీసుకురావడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక అల్గారిథమ్తో ముందుకు వచ్చింది. సవరణలతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తూనే .. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలో పడేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా రావడానికి కారణం కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను అమలు చేయడమే. సీపీఎస్ను వద్దని పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను అమలు చేయాలని దేశంలోని చాలా రాష్ట్రాల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ పెన్షన్ స్కీమ్లో సవరణలకు కేంద్రం పూనుకుంది.
Read also: Komatireddy Venkatreddy: అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతాం
Also Read
సీపీఎస్ను రద్దు చేయాలని.. ఓపీఎస్ను పునరుద్దరించాలని దేశంలోని ఎక్కువ రాష్ర్టాల ఉద్యోగులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్గడ్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఇప్పటికే సీపీఎస్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాలు కూడా సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ సర్కార్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా జాతీయ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో సవరణకు ఒక కొత్త అల్గారిథమ్తో ముందుకు వచ్చింది. దీంతో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరుస్తూనే.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఇరకాటంలో పారేసే అవకాశమున్నట్టు కేంద్రం భావిస్తోంది. గతంలో పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి చెల్లింపులు చేసేవారు కాదు. అప్పటి ఎన్పీఎస్ ప్రకారం ఉద్యోగి చివరిసారిగా తీసుకున్న జీతంలో 50 శాతం రిటైర్మెంట్ తరువాత పెన్షన్గా వచ్చేది. 2004లో అప్పటి సర్కార్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్ను తెరపైకి తెచ్చింది. సీపీఎస్లో ఉద్యోగి మూలవేతనంలో 10 శాతం.. ప్రభుత్వం 14 శాతం వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రం తాజా ఆలోచన ప్రకారం రిటైర్ అయ్యాక ఉద్యోగులకు నిర్థిష్ట మొత్తంలో పెన్షన్ అందేలా చూడడమే. ఇందుకోసం ఇప్పుడు వస్తున్న చివరి జీతంలో 38 శాతం దాకా పెన్షన్ను.. 40 నుంచి 45 శాతం దాకా పెంచాలని కేంద్రం ప్రతిపాదన. పాత పెన్షన్ విధానం మాదిరిగా 50 శాతం పెన్షన్ రాకున్నా 40 నుంచి 45 శాతం వరకు వచ్చేలా చూస్తే రిటైర్మెంట్ జీవితంలో ఉద్యోగికి అబ్ధి కలుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే అమలులోకి వస్తుంది. రాష్ట్రాల్లోని ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!