NTV Telugu Site icon

TDP-JDU: టీడీపీకి 4, జేడీయూకి 2.. మోడీ ప్రభుత్వంలో కేబినెట్ బెర్తులు..?

Nda

Nda

TDP-JDU: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుపుతో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2014, 2019లో కాకుండా ఈ సారి మ్యాజిక్‌ఫిగర్(272)ని బీజేపీ స్వతహాగా సాధించలేకపోయింది. 240 సీట్ల వద్దే ఆగిపోయింది. దీంతో కూటమిలోని తెలుగుదేశం(టీడీపీ), జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), శివసేన కీలకంగా మారాయి. మొత్తం 543 ఎంపీ సీట్లలో ఎన్డీయేకి ప్రస్తుతం 293 ఎంపీ బలం ఉంది.

Read Also: Shiv Sena: షిండే క్యాంప్‌తో టచ్‌లో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు..?

ఇదిలా ఉంటే మోడీ 3.0 సర్కార్‌లో మిత్రపక్షాలకు బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. చంద్రబాబు నాయుడు టీడీపికి నాలుగు మంత్రిత్వ శాఖలు, నితీష్ కుమార్ జేడీయూకి 02 మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జేడీయూ నుంచి ఇద్దరు సీనియర్ నేతలైన లాలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ల పేర్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం టీడీపికి 16, జేడీయూకి 12 సీట్లు ఉన్నాయి.