Medicine Prices: ఏప్రిల్ నుంచి మెడిసిన్ ధరల పెంపు అంతా ఉత్తదే.. కేంద్రం క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medicine Prices: ఏప్రిల్ నెల నుంచి దేశంలో పలు రకాల మెడిసిన్స్పై ధరలు పెరుగుతాయని ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీడియాలో మందుల ధరలపై వచ్చిన కథనాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. మెడిసిన్ ధరల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని చెప్పిన మీడియా నివేదికలను ‘‘తప్పుడు, తప్పుదోవ పట్టించేవి, హానికరమైనవి’’గా బుధవారం పేర్కొంది.
కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఔషధాల ధరలు 12శాతం చొప్పున పెరుగుతాయని నివేదించింది. ఇది 500 కంటే ఎక్కువ మందుల్ని ప్రభావితం చేస్తాయని తెలిపాయి. అయితే ఇదంతా ఉత్తదే అని, టోకు ధరల సూచి(WPI) ఆధారంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ) ఏటా షెడ్యూల్ చేసిన మందుల సీలింగ్ ధరలను సవరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ‘‘WPI పెరుగుదల 0.00551 శాతం ఆధారంగా, 782 ఔషధాల కోసం ప్రస్తుత సీలింగ్ ధరలలో ఎటువంటి మార్పు ఉండదు, అయితే 54 ఔషధాలపై రూ. 0.01 (ఒక పైసా) స్వల్ప పెరుగుదల ఉంటుంది’’ అని తెలిపింది.
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 7న ఆప్ నిరాహార దీక్ష
ఈ 54 మెడిసిన్స్ సీలింగ్ ధర రూ. 90 నుంచి రూ. 261 వరకు ఉంటుంది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్స్ (డిపిసిఓ) 2013 నిబంధనల ప్రకారం డబ్ల్యూపీఐ పెంపు అనుమతించదగిన గరిష్ట పెంపుదల అని, తయారీదారులు పెంపు తక్కువగా ఉండటంతో మందుల ధరల్ని పెంచొచ్చు, పెంచకపోవచ్చు అని మంత్రిత్వశాఖ తెలిపింది. అందువలన, FY 2024-25 సంవత్సరంలో, WPI ఆధారంగా ఔషధాల సీలింగ్ ధరలో దాదాపు ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. తమ ఔషధాల సీలింగ్ ధరపై ఆధారపడి, కంపెనీలు తమ గరిష్ట రిటైల్ ధర (MRP)ని MRP (GST మినహాయించి) సీలింగ్ ధర కంటే తక్కువ ధరగా మార్చవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని, ధరల వివవరాలు NPPA వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ధరలు మార్చి 31, 2025 వరకు కొనసాగుతాయి.
తాజావార్తలు
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?