CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
- CJP, విద్యార్థి నిరసనకారులకు కేంద్రం మరోసారి చర్చల ఆహ్వానం.
- నిన్నటి నుంచి నాలుగు అధికారిక ప్రతిపాదనలు పంపినట్లు జితేంద్ర సింగ్ వెల్లడి.
- జేపీ నడ్డా కార్యాలయం లేదా నివాసంలో చర్చలకు సిద్ధమని ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనకారులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. బుధవారం నుంచి నాలుగు సార్లు ఆహ్వానం పంపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం నుంచి చర్చల కోసం నాలుగు అధికారి ప్రతిపాదనల్ని పంపిందని తెలిపారు. నిరసనకారులకు అనువైన సమయంలో, ఎప్పుడైనా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా పాల్గొంటారని వెల్లడించారు.
జేపీ నడ్డా కార్యాలంలో లేదా ఆయన నివాసంలో చర్చలు జరగొచ్చని, మాకు ప్రతిష్ట ముఖ్యం కాదని, జేపీ నడ్డా తాను ఇద్దరం చర్చలు జరుపుతామని జితేంద్ర సింగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న వరస చర్యల్లో ఇది ఒకటని చెప్పారు. అందరూ చర్చలకు రావాలని వినమ్రంగా కోరతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పేపర్ లీక్స్కు పాల్పడే వారిపై వేగంగా న్యాయంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ గురువారం ప్రకటించారు.
Also Read
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుంటే, తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలని సీజీపీ నేత అభిజిత్ దీప్కే అన్నారు. జంతర్ మంతర్ వద్దకు కేంద్ర రావాలని అల్టిమేటం విధించారు. కేంద్రం డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయని చెబుతుందని, జంతర్ మంతర్ డోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయని ఆయన అన్నారు. సీజేపీ అధికారిక ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చలు జరగాలంటే తటస్థ వేదికలో లేదా జంతర్ మంతర్ వద్ద జరగాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు.
#WATCH | Delhi | On updated proposal for talks with Cockroach Janta Party, Union Minister Dr Jitendra Singh says, "The govt has sent four formal proposals for discussions with their representatives since last afternoon…This is a standing invitation to all our youth friends that… pic.twitter.com/PAQ6PbeNIa
— ANI (@ANI) July 23, 2026
తాజావార్తలు
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!