CNG Rates: 10 శాతం వరకు తగ్గనున్న సీఎన్జీ ధరలు.. ధర విధానంలో మార్పుకు కేంద్రం ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Rates: సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకురాబోతోంది. ధర పరిమితి విధించేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ఏ, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ధర 10 శాతం వరకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధర 6 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్ గురువారం తెలిపారు.
Read Also: Sri Maha Lakshmi Stotram: కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి లాంటి శ్రీమహాలక్ష్మి స్తోత్రాలు
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
ఈ మార్పలకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో శనివారం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇటీవల కాలంలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు 80 శాతం మేర పెరిగిన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యుడికి ఊరట కలగనుంది. 2030 నాటికి ఇండియా ఇంధన వాడకంలో సహజవాయువు వాటాను ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం వల్ల సహజవాయువు వినియోగాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు సహాయపడుతుంది.
కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల వినియోగదారుడికి సహాయపడుతుందని ఇంధన మంత్రి హర్దీప్ పూరీ ట్వీట్ చేశారు. భారత దేశంలోని గ్యాస్ ధరలపై విదేశాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కొనసాగింపుగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హెన్రీ హబ్, అల్బెనా, నేషనల్ బ్యాలెన్సింగ్ పాయింట్(బ్రిటన్), రష్యా అనే 4 గ్యాస్ ట్రేడింగ్ హబ్ లలో ధరల ఆధారంగా దేశీయ గ్యాస్ ధరలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి నిర్ణయించేవారు. అయితే ఈ విధానాన్ని కేంద్రం తాజాగా మార్చబోతోంది.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!