Kishan Reddy: మోడీ సర్కార్ వారి పాట.. బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని, ఎందరో ప్రధానిని కలుస్తుంటారు.. ఈ సమయంలో ప్రధానికి గౌరవంగా బహుమతులు ఇస్తుంటారని ఆయన తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారి ప్రధాని మోడీ ఆ బహుమతులన్నింటిని మళ్లీ దేశం కోసం వెనక్కి ఇస్తున్నారని చెప్పారు.
ఓ చిన్నారి మోడీ వేసుకున్న శాలువా కావాలని గతంలో లేఖ రాసిందని.. స్పందించిన ప్రధాని శాలువాను చిన్నారికి పంపించారన్నారు. 2019 నుంచి ప్రతియేటా బహుమతుల వేలం జరుగుతోందన్న కిషన్రెడ్డి.. ఈ సారి 1222 బహుమతులకు వేలం జరుగుతోందన్నారు. 2.7 కోట్ల సర్కార్ వారి పాట అంటే కనీస ధర అని ఆయన అన్నారు. 25 బహుమతులు క్రీడాకారులు ఇచ్చినవి ఉన్నాయన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Delhi Excise Policy: ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఈడీ.. 4 రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాడులు
అయోధ్య రామమందిరం బహుమతితో పాటు వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం నమూనా గిఫ్ట్ కూడా ఉందన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహం కూడా వేలంలో ఉందన్నారు. వేలం ద్వారా వచ్చిన నిధులను నవామి గంగ కోసం కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా వేలంలో పాల్గొనవచ్చన్నారు. గతేడాది బహుమతుల వేలం ద్వారా 15.7 కోట్ల రూపాయలు సమకూరాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!