Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.8కే కిలో శనగలు సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు 15 లక్షల మెట్రిక్ టన్నుల శనగలను విడుదల చేసింది. ఈ పథకం కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేయనుంది. కంది, మినుములు, మైసూరుపప్పు సేకరణ పరిమితిని 25 నుంచి 40 శాతానికి పెంచాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మధ్యాహ్న భోజనం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమాలు (ICDP) మొదలైన వివిధ సంక్షేమ పథకాలు లేదా కార్యక్రమాలలో ఈ పప్పులను ఉపయోగించుకోవాలి. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలు మొదలైన వివిధ సంక్షేమ పథకాలలో శనగలను ఉపయోగించుకునేలా చేస్తాయి. గిడ్డంగుల స్థలాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు ధర మద్దతు పథకం కింద సేకరించిన తాజా స్టాక్లను ఉంచడానికి రాబోయే రబీ సీజన్లో ఇది అవసరం అవుతుంది. రైతులకు పప్పుధాన్యాల లాభదాయకమైన ధరను పొందడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ మంది రైతులను అధిక పెట్టుబడి పెట్టడం ద్వారా అటువంటి పప్పులను పండించేలా ప్రోత్సహిస్తుంది. వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన దేశంలో ఇటువంటి పప్పుధాన్యాల స్వయం సమృద్ధిని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఇటీవలి కాలంలో దేశం ముఖ్యంగా గత మూడు సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో శనగలను పండించింది. దీంతో ధర మద్దతు పథకం కింద భారత ప్రభుత్వం రబీ 2019-20, 2020-21 & 2021-22 కాలంలో రైతుల నుంచి శనగలను రికార్డు స్థాయిలో సేకరించింది. దీని కారణంగా రాబోయే రబీ సీజన్లో కూడా 30.55 లక్షల మెట్రిక్ టన్నుల చనా ప్రభుత్వం వద్ద PSS & PSF కింద అందుబాటులో ఉంది. అటు 2022-23 సమయంలో శనగల కనీస మద్దతు ధర పెరుగుదలతో పాటు ధర మద్దతు పథకం కింద అదనపు సేకరణను కేంద్రం చేపట్టింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!