Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.8కే కిలో శనగలు సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు 15 లక్షల మెట్రిక్ టన్నుల శనగలను విడుదల చేసింది. ఈ పథకం కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేయనుంది. కంది, మినుములు, మైసూరుపప్పు సేకరణ పరిమితిని 25 నుంచి 40 శాతానికి పెంచాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మధ్యాహ్న భోజనం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమాలు (ICDP) మొదలైన వివిధ సంక్షేమ పథకాలు లేదా కార్యక్రమాలలో ఈ పప్పులను ఉపయోగించుకోవాలి. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలు మొదలైన వివిధ సంక్షేమ పథకాలలో శనగలను ఉపయోగించుకునేలా చేస్తాయి. గిడ్డంగుల స్థలాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు ధర మద్దతు పథకం కింద సేకరించిన తాజా స్టాక్లను ఉంచడానికి రాబోయే రబీ సీజన్లో ఇది అవసరం అవుతుంది. రైతులకు పప్పుధాన్యాల లాభదాయకమైన ధరను పొందడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ మంది రైతులను అధిక పెట్టుబడి పెట్టడం ద్వారా అటువంటి పప్పులను పండించేలా ప్రోత్సహిస్తుంది. వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన దేశంలో ఇటువంటి పప్పుధాన్యాల స్వయం సమృద్ధిని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
ఇటీవలి కాలంలో దేశం ముఖ్యంగా గత మూడు సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో శనగలను పండించింది. దీంతో ధర మద్దతు పథకం కింద భారత ప్రభుత్వం రబీ 2019-20, 2020-21 & 2021-22 కాలంలో రైతుల నుంచి శనగలను రికార్డు స్థాయిలో సేకరించింది. దీని కారణంగా రాబోయే రబీ సీజన్లో కూడా 30.55 లక్షల మెట్రిక్ టన్నుల చనా ప్రభుత్వం వద్ద PSS & PSF కింద అందుబాటులో ఉంది. అటు 2022-23 సమయంలో శనగల కనీస మద్దతు ధర పెరుగుదలతో పాటు ధర మద్దతు పథకం కింద అదనపు సేకరణను కేంద్రం చేపట్టింది.
తాజావార్తలు
-
SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
-
Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్తో మరో రికార్డు?
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!