Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.8కే కిలో శనగలు సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు 15 లక్షల మెట్రిక్ టన్నుల శనగలను విడుదల చేసింది. ఈ పథకం కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేయనుంది. కంది, మినుములు, మైసూరుపప్పు సేకరణ పరిమితిని 25 నుంచి 40 శాతానికి పెంచాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మధ్యాహ్న భోజనం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమాలు (ICDP) మొదలైన వివిధ సంక్షేమ పథకాలు లేదా కార్యక్రమాలలో ఈ పప్పులను ఉపయోగించుకోవాలి. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలు మొదలైన వివిధ సంక్షేమ పథకాలలో శనగలను ఉపయోగించుకునేలా చేస్తాయి. గిడ్డంగుల స్థలాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు ధర మద్దతు పథకం కింద సేకరించిన తాజా స్టాక్లను ఉంచడానికి రాబోయే రబీ సీజన్లో ఇది అవసరం అవుతుంది. రైతులకు పప్పుధాన్యాల లాభదాయకమైన ధరను పొందడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ మంది రైతులను అధిక పెట్టుబడి పెట్టడం ద్వారా అటువంటి పప్పులను పండించేలా ప్రోత్సహిస్తుంది. వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన దేశంలో ఇటువంటి పప్పుధాన్యాల స్వయం సమృద్ధిని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Also Read
ఇటీవలి కాలంలో దేశం ముఖ్యంగా గత మూడు సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో శనగలను పండించింది. దీంతో ధర మద్దతు పథకం కింద భారత ప్రభుత్వం రబీ 2019-20, 2020-21 & 2021-22 కాలంలో రైతుల నుంచి శనగలను రికార్డు స్థాయిలో సేకరించింది. దీని కారణంగా రాబోయే రబీ సీజన్లో కూడా 30.55 లక్షల మెట్రిక్ టన్నుల చనా ప్రభుత్వం వద్ద PSS & PSF కింద అందుబాటులో ఉంది. అటు 2022-23 సమయంలో శనగల కనీస మద్దతు ధర పెరుగుదలతో పాటు ధర మద్దతు పథకం కింద అదనపు సేకరణను కేంద్రం చేపట్టింది.
తాజావార్తలు
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!