Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.8కే కిలో శనగలు సరఫరా
Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు 15 లక్షల మెట్రిక్ టన్నుల శనగలను విడుదల చేసింది. ఈ పథకం కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేయనుంది. కంది, మినుములు, మైసూరుపప్పు సేకరణ పరిమితిని 25 నుంచి 40 శాతానికి పెంచాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మధ్యాహ్న భోజనం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమాలు (ICDP) మొదలైన వివిధ సంక్షేమ పథకాలు లేదా కార్యక్రమాలలో ఈ పప్పులను ఉపయోగించుకోవాలి. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలు మొదలైన వివిధ సంక్షేమ పథకాలలో శనగలను ఉపయోగించుకునేలా చేస్తాయి. గిడ్డంగుల స్థలాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు ధర మద్దతు పథకం కింద సేకరించిన తాజా స్టాక్లను ఉంచడానికి రాబోయే రబీ సీజన్లో ఇది అవసరం అవుతుంది. రైతులకు పప్పుధాన్యాల లాభదాయకమైన ధరను పొందడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ మంది రైతులను అధిక పెట్టుబడి పెట్టడం ద్వారా అటువంటి పప్పులను పండించేలా ప్రోత్సహిస్తుంది. వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన దేశంలో ఇటువంటి పప్పుధాన్యాల స్వయం సమృద్ధిని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
ఇటీవలి కాలంలో దేశం ముఖ్యంగా గత మూడు సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో శనగలను పండించింది. దీంతో ధర మద్దతు పథకం కింద భారత ప్రభుత్వం రబీ 2019-20, 2020-21 & 2021-22 కాలంలో రైతుల నుంచి శనగలను రికార్డు స్థాయిలో సేకరించింది. దీని కారణంగా రాబోయే రబీ సీజన్లో కూడా 30.55 లక్షల మెట్రిక్ టన్నుల చనా ప్రభుత్వం వద్ద PSS & PSF కింద అందుబాటులో ఉంది. అటు 2022-23 సమయంలో శనగల కనీస మద్దతు ధర పెరుగుదలతో పాటు ధర మద్దతు పథకం కింద అదనపు సేకరణను కేంద్రం చేపట్టింది.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!