Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.8కే కిలో శనగలు సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు 15 లక్షల మెట్రిక్ టన్నుల శనగలను విడుదల చేసింది. ఈ పథకం కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేయనుంది. కంది, మినుములు, మైసూరుపప్పు సేకరణ పరిమితిని 25 నుంచి 40 శాతానికి పెంచాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మధ్యాహ్న భోజనం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమాలు (ICDP) మొదలైన వివిధ సంక్షేమ పథకాలు లేదా కార్యక్రమాలలో ఈ పప్పులను ఉపయోగించుకోవాలి. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలు మొదలైన వివిధ సంక్షేమ పథకాలలో శనగలను ఉపయోగించుకునేలా చేస్తాయి. గిడ్డంగుల స్థలాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు ధర మద్దతు పథకం కింద సేకరించిన తాజా స్టాక్లను ఉంచడానికి రాబోయే రబీ సీజన్లో ఇది అవసరం అవుతుంది. రైతులకు పప్పుధాన్యాల లాభదాయకమైన ధరను పొందడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ మంది రైతులను అధిక పెట్టుబడి పెట్టడం ద్వారా అటువంటి పప్పులను పండించేలా ప్రోత్సహిస్తుంది. వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందడంలో వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా మన దేశంలో ఇటువంటి పప్పుధాన్యాల స్వయం సమృద్ధిని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ఇటీవలి కాలంలో దేశం ముఖ్యంగా గత మూడు సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో శనగలను పండించింది. దీంతో ధర మద్దతు పథకం కింద భారత ప్రభుత్వం రబీ 2019-20, 2020-21 & 2021-22 కాలంలో రైతుల నుంచి శనగలను రికార్డు స్థాయిలో సేకరించింది. దీని కారణంగా రాబోయే రబీ సీజన్లో కూడా 30.55 లక్షల మెట్రిక్ టన్నుల చనా ప్రభుత్వం వద్ద PSS & PSF కింద అందుబాటులో ఉంది. అటు 2022-23 సమయంలో శనగల కనీస మద్దతు ధర పెరుగుదలతో పాటు ధర మద్దతు పథకం కింద అదనపు సేకరణను కేంద్రం చేపట్టింది.
తాజావార్తలు
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!