బ్రేకింగ్: సీబీఎస్ఈ పరీక్షలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ ఎఫ్టెక్ట్తో వాయిదా పడుతూ వచ్చిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేశారు.. కేబినెట్ మంత్రులు, ఉన్నాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.. గత ఏడాది మాదిరే ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు మార్కులు వేయనున్నారు.. కరోనా సమయంలో.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.. విద్యార్థులు ఆరోగ్యం, భద్రత చాలా ముఖ్యమని.. ఈ అంశంపై ఎటువంటి రాజీ ఉండబోదని.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సమయంలో.. భయాందోళనల మధ్య విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇక, సీబీఎస్ఈ పరీక్షలపై ఇప్పటివరకు నిర్వహించిన విస్తృతమైన సంప్రదింపుల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అందరు భాగస్వాముల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని.. కోవిడ్ కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, అందరి అభిప్రాయాలను అనుగుణంగా.. పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని నిర్ణయించారు. ఇప్పటివరకు నిర్వహించిన ఆబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం పన్నెండో తరగతి విద్యార్థుల ఫలితాలను సంకలనం చేయడానికి సిబిఎస్ఈ చర్యలు తీసుకుంటుందని కూడా నిర్ణయించారు. ఇక, సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలపై నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలకు లోబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. కరోనా వైరస్ అకాడెమిక్ క్యాలెండర్ను ప్రభావితం చేసిందని.. బోర్డు పరీక్షలు.. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులలో విపరీతమైన ఆందోళన కలిగించిందని.. దీనికి తప్పనిసరిగా ముగింపు పలకాల్సిందేనని పేర్కొన్నారు ప్రధాని. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. మరికొన్ని రాష్ట్రాల్లో మైక్రో కంటైన్మెంట్ ద్వారా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారి.. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయని… ఇలాంటి పరిస్థితిలో విద్యార్థుల ఆరోగ్యం గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సహజంగా ఆందోళన చెందుతున్నారని.. అటువంటి ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో విద్యార్థులు బలవంతంగా పరీక్షలకు హాజరుకావద్దని ప్రధాని అన్నారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
తాజావార్తలు
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!