Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం.. టీఎంసీ యువనేతతో లింక్స్..
- కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో కీలక పరిణామం..
- టీఎంసీ నేతతో సందీప్ ఘోస్ సంబంధాలపై దర్యాప్తు..
- తృణమూల్ లీడర్ ఫోన్ కాల్..మెసేజ్ డేటా సేకరణకు యత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ పీజీ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. కోల్కతాలో డాక్టర్ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారణ జరుపుతోంది. నిందితుడు సంజయ్ రాయ్, డాక్టర్ సెమినార్ హాల్లో నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కేసులో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) యువనేత ఆశిష్ గుప్తాకు సంబంధించిన మొబైల్ ఫోన్ కాల్, మెసేజ్ డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Read Also: Work Culture :ఆఫీసు నుంచి పని చేయడం మంచిదా? ఇంట్లోంచి వర్క్ చేయడం బెటరా?: తాజా నివేదిక
Also Read
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
పాండే మొబైల్ ఫోన్లో కాల్స్, మెసేజ్ డేటాను నిర్ణీత సమయంలో కొన్ని ఆధారాలను తొలగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో డేటాను రిట్రీవ్ చేయాలని భావిస్తున్నారు. ఒకసారి ఈ డేటా ఏంటనే విషయాలు తెలిస్తే, దీంట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సీబీఐ భావిస్తోంది. ఆశిష్ పాండేకి, మాజీ ఆర్జీ కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సందీప్ ఘోష్ విశ్వసనీయుల్లో ఇతను ఒకరు.
మొబైల్ ఫోన్లోని వివరాలు తెలిస్తే, ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యాచారం, హత్య కేసుతో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలపై సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆశిష్ పాండే డిలీట్ చేసిన కాల్స్, మెసేజెస్లు ప్రధానంగా సందీప్ ఘోష్కి సంబంధించినవి ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో తాలా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మోండల్పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం-హత్య కేసు విచారణలో అలసత్వం ప్రదర్శించి, కేసు వివరాలను తారుమారు చేయాలని భావించాడు. ఆర్థిక అవకతవకల కేసులో పాండేను అక్టోబర్ 3న సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!