Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సీబీఐ షాక్..
- జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్కి సీబీఐ షాక్..
- అవినీతి కేసులో సత్యపాల్ మాలిక్పై ఛార్జిషీట్..
Satya Pal Malik: సుమారు రూ. 2200 కోట్ల విలువైన కిరు జల విద్యుత్ ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కాంట్రాక్టుల మంజూరుకు సంబంధించి అవినీతి కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కి ఉచ్చు బిగిస్తోంది. సీబీఐ ఆయనపై గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కిష్ట్వార్లో కిరు జల విద్యుత్ ప్రాజెక్టు టెంటర్ల ప్రక్రియకలో జరిగిన అనుమానిత అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఆగస్టు 23, 2018 నుండి అక్టోబర్ 30, 2019 వరకు పనిచేసిన మాలిక్, రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ. 300 కోట్ల లంచం ఆఫర్ చేశారని గతంలో ఆరోపించారు, ఇందులో కిరు విద్యుత్ ప్రాజెక్టుకు చెందినది కూడా ఉంది. ఈ కేసులో ఫిబ్రవరి 2024లో సీబీఐ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లోని మాలిక్ నివాసాలతో పాటు 30కి పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
మాలిక్తో పాటు ఆయన సహచరులు, కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు అమలు చేస్తున్న చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్(CVPPPL)తో సంబంధం ఉన్న అధికారులపై కూడా దాడులు జరిగాయి. CVPPPL మాజీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, మాజీ అధికారులు ఎంఎస్ బాబు, ఎంకే మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రా, వీరితో పాటు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి అనేక మంది వ్యక్తులు సీబీఐ రాడార్లోకి వచ్చారు.
Read Also: India On Turkey: పాకిస్తాన్కి టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత్ కీలక సూచనలు..
సీబీఐ చెబుతున్న దాని ప్రకారం, CVPPPL బోర్డు 47వ సమావేశంలో రివర్స్ వేలం ద్వారా ఈ -టెండరింగ్ ద్వారా ప్రాజెక్టును తిరిగి టెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీనిని అమలు చేయలేదు, కాంట్రాక్టును చివరకు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్కి ఇచ్చారు. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ దాడులు తనను బెదిరించే ప్రయత్నం అని సత్యపాల్ మాలిక్ అన్నారు.
సీబీఐ చార్జిషీట్ తర్వాత, సత్యపాల్ మాలిక ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. ‘‘నేను గత మూడు నుండి నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను మరియు ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల ద్వారా నియంత నా ఇంటిపై దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్ మరియు నా సహాయకుడిని కూడా అనవసరంగా దాడి చేసి వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని, ఈ దాడులకు నేను భయపడను. నేను రైతులతో ఉన్నాను.’’ అని అందులో పేర్కొన్నారు. లంచం ఆఫర్కి సంబంధించి సత్యపాల్ మాలిక్ బహిరంగ ఆరోపణల నేపథ్యంలో 2022లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా కాంట్రాక్టు మంజూరులో అవకతవకలు జరిగాయనే ఆధారాలు బయటపడ్డాయి.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!