Manipur Violence: మణిపూర్లో మరోసారి హింస.. మొత్తం అల్లర్లపై సీబీఐ దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: గత నెల రోజులుగా జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారు. శుక్రవారం ఖోకెన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనప్రదేశం కాంగ్ పోక్పి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దుల్లో ఉంది. అనుమానిత ఉగ్రవాదులు, బాధితులు వేర్వేరు వర్గాలకు చెందినవారిగా గుర్తించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం(ఐటీఎల్ఎఫ్) డిమాండ్ చేసింది.
మే ప్రారంభంలో మైయిటీ, కూకీల మధ్య ఘర్షణ తలెత్తింది. క్రమంగా ఇవి హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. 35,000 మంది నిరాశ్రయులయ్యారు. మైయిటీ కమ్యూనిటీకి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్ ను వ్యతిరేకిస్తూ.. కుకీలు ‘గిరిజన సంఘీభావ యాత్ర’’ నిర్వహించిన సమయంలో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి.
Also Read
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ఇదిలా ఉంటే ఈ ఘర్షణల వెనక కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సీబీఐ దర్యాప్తులో ఈ ఘర్షణల్లో కుట్ర ఉందో లేదో తెలియనుంది. హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3700 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. ఇందులో ఎక్కువగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఎక్కువ కేసులు ఉన్నాయి. కాంగ్పోక్పి, బిష్ణుపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Read Also: Schools Reopen: ఈ నెల 12 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్
ఘర్షణల నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించారు. మైయిటీ, కూకీ, నాగా కమ్యూనిటీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుత మణిపూర్ లో శాంతియుత పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. నిర్వాసితులకు సాయం చేయడానికి రూ.101.75 కోట్ల సహాయప్యాకేజీకి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
హింస ప్రారంభమైనప్పటి నుండి, మణిపూర్లోని పోలీసు ఆయుధాలు మరియు శిబిరాల నుండి 4,000 పైగా ఆయుధాలు లూటీ చేయబడ్డాయి. అయితే, భద్రతా బలగాలు మొత్తం 896 ఆయుధాలు, 11,763 మందుగుండు సామాగ్రి మరియు 200 వివిధ రకాల బాంబులను స్వాధీనం చేసుకున్నాయి, వీటిలో బుధవారం నుండి స్వాధీనం చేసుకున్న మరో 28 ఆయుధాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!