Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు.. ఎందుకంటే?
- అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు
- యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం విషం కలిపిందని ఆరోపణలు
- షాబాద్ కు చెందిన జగ్మోహన్ అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం చూపు ఇప్పుడు ఢిల్లీపై పడింది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. కేసుకు గల కారణం ఏంటంటే యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హర్యానాలో కేసు నమోదైంది.
ఇటీవల కేజ్రీవాల్ యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గట్టిగానే స్పందించారు. ఏకంగా యమునా నీటిని తాగి విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ సైతం కేజ్రీవాల్ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
తాజాగా షాబాద్ కు చెందిన జగ్మోహన్ అనే లాయర్ కేజ్రీవాల్ పై కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?