Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు.. ఎందుకంటే?
- అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ అధినేతపై కేసు
- యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం విషం కలిపిందని ఆరోపణలు
- షాబాద్ కు చెందిన జగ్మోహన్ అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం చూపు ఇప్పుడు ఢిల్లీపై పడింది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆప్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. కేసుకు గల కారణం ఏంటంటే యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హర్యానాలో కేసు నమోదైంది.
ఇటీవల కేజ్రీవాల్ యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విషం కలిపిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. అయితే కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గట్టిగానే స్పందించారు. ఏకంగా యమునా నీటిని తాగి విమర్శలను తిప్పికొట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ సైతం కేజ్రీవాల్ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
తాజాగా షాబాద్ కు చెందిన జగ్మోహన్ అనే లాయర్ కేజ్రీవాల్ పై కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!