Canadian Sikh MP: భారత్పై ఆంక్షలు, ఆర్ఎస్ఎస్పై బ్యాన్.. కెనడియన్ సిక్కు ఎంపీ కామెడీ..
- భారత్పై ఆంక్షలు.. ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలట..
- కెనడియన్ సిక్ ఎంపీ జగ్మీత్ సింగ్ వ్యాఖ్యలు..
- ప్రెస్మీట్లో నవ్వుకున్న జర్నలిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canadian Sikh MP: ఇండియా, కెనడాల మధ్య దౌత్యయుద్ధం జరగుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గతేడాది సర్రే నగరంలోని గురుద్వారా వద్ద కాల్చి చంపారు. అయితే, ఈ ఘటనలో భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంపై వివాదం చెలరేగింది. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడింది. సిక్కు ఓట్ల కోసం భారత్ని టార్గెట్ చేస్తున్న విషయం అర్థమైంది. ఇదిలా ఉంటే, ఇండియా కెనడాలోని తన రాయబారుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు భారత్లోని కెనడా రాయబారుల్ని శనివారం లోగా దేశం వదిలివెళ్లాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, ఖలిస్తాన్కి గట్టి మద్దతుదారు, ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కెనడియన్ సిక్క్ ఎంపీ జగ్మీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఎగతాళి చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా మొత్తం నవ్వుకుంది. భారత రాయబారులు, భారతదేశంపై ఆంక్షలు విధించాలని జగ్మీత్ సింగ్ డిమాండ్ చేశారు. ‘‘మోదీ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి మరియు కెనడియన్ నాయకులుగా మనమందరం ఏకం కావాలి. మనమందరం (PM నరేంద్ర) మోడీని ఖండించడంలో ఐక్యంగా ఉండాలి, కెనడియన్ల భద్రతకు అన్నింటి కన్నా ముఖ్యం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
ఇంతటితో ఆగకుండా కెనడియన్ సిక్కులు భయంతో కొట్టుమిట్టాడుతున్నారని, భారత దౌత్యవేత్తల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని, కెనడాలో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చాడు. అయితే, ఆయన వ్యాఖ్యలపై ఓ విలేకరి జోక్యం చసుకుంటూ.. భారతదేశంపై ఆంక్షలు విధిస్తే కెనడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెప్పాడు. దీంతో జగ్మీత్ సింగ్.. కెనడా కేవలం భారత దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుంటుందని మాటమార్చాడు. జగ్మీత్ వ్యాఖ్యలపై సదరు రిపోర్టర్ మాట్లాడుతూ.. మీకు వ్యూహాత్మకమైన విధానం అవసరమంటూ ఎగతాళి చేశాడు.
పరిస్థితి తన కంట్రోల్లో లేదనుకన్న జగ్మీత్ సింగ్ అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. ఆయనను ఎగతాళి చేస్తూ ‘‘అతను వెళ్లిపోయాడు.. అతను వెళ్లిపోయాడు’’ అని మాట్లాడుకోవడం వినవచ్చు. అంతకుముందు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కూడా భారత్పై ఆంక్షలు విధించడాన్ని చర్చిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!