Canada: “1984 సిక్కు మారణహోమానికి” అధికార గుర్తింపు కోరిన సిక్కు ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో పార్టీలో అధికార అవగాహన కుదుర్చుకున్న కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) ‘‘ 1984 సిక్కు మారణహోమాన్ని’’ అధికారి గుర్తింపు కోరింది. ఇది క్రూరమైన ప్రభుత్వ ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు కావస్తున్న సమయంలో ఎన్డీపీ ఎంపీ జగ్మీత్ సింగ్ ఈ ప్రతిపాదన చేశారు. కెనడా పార్లమెంట్లో ఆయన ఈ ఘటనపై అధికారి గుర్తింపు కోరుతారని ఎన్డీపీ ప్రచారంలో పేర్కొన్నారు. శనివారం బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో జరిగిన వైశాఖి పరేడ్లో పాల్గొన్న జగ్మిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సిక్కు మారణహోమం యొక్క 40వ వార్షికోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా సిక్కు మారణహోమాన్ని సమాఖ్య స్థాయిలో గుర్తించాలి’’ అని అన్నారు.
Also Read
‘‘ఈ రాష్ట్ర-వ్యవస్థీకృత హత్యాకాండను జెనోసైడ్గా గుర్తించాలని మేము కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము’’ అని జగ్మిత్ సింగ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హత్య అక్టోబర్ 1984లో చోటు చేసుకున్న తర్వాత సిక్కుల హత్యలు చోటు చేసుకున్నాయి. దీనినే కొందరు సిక్కుల ఊచకోతగా అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ 2017లో అంటారియో శాసనసభ ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, ఇది భారత్- కెనడాల మధ్య విభేదాలకు కారణమైంది. అంటారియా శాసనసభ్యుడిగా ఉన్న లిబరల్ పార్టీకి చెందిన హరీందర్ మల్హీ ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు.
వేర్పాటువాద సంస్థ, భారత్లో ఉగ్రవాద సంస్థగా గుర్తింపుపొందిన సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) స్పందిస్తూ.. ఇది సానుకూలదశగా పేర్కొంది. ఇప్పటికే ఖలిస్తాన్ రెఫరెండంతో ఈ సంస్థ భారత్లో విభజనను ప్రోత్సహిస్తోంది. ఇదే డిమాండ్ చేస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(KTF) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు ఏకంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు మరో ఖలిస్తానీ ఉగ్రవాది ఎస్జేఎఫ్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను భారత్కి చెందిన ఓ వ్యక్తి చంపేందుకు కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చెక్ రిపబ్లిక్లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని అమెరికా తీసుకువచ్చేందుకు ఆ దేశంతో చర్చలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!