Canada: “1984 సిక్కు మారణహోమానికి” అధికార గుర్తింపు కోరిన సిక్కు ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో పార్టీలో అధికార అవగాహన కుదుర్చుకున్న కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) ‘‘ 1984 సిక్కు మారణహోమాన్ని’’ అధికారి గుర్తింపు కోరింది. ఇది క్రూరమైన ప్రభుత్వ ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు కావస్తున్న సమయంలో ఎన్డీపీ ఎంపీ జగ్మీత్ సింగ్ ఈ ప్రతిపాదన చేశారు. కెనడా పార్లమెంట్లో ఆయన ఈ ఘటనపై అధికారి గుర్తింపు కోరుతారని ఎన్డీపీ ప్రచారంలో పేర్కొన్నారు. శనివారం బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో జరిగిన వైశాఖి పరేడ్లో పాల్గొన్న జగ్మిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సిక్కు మారణహోమం యొక్క 40వ వార్షికోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా సిక్కు మారణహోమాన్ని సమాఖ్య స్థాయిలో గుర్తించాలి’’ అని అన్నారు.
Also Read
‘‘ఈ రాష్ట్ర-వ్యవస్థీకృత హత్యాకాండను జెనోసైడ్గా గుర్తించాలని మేము కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము’’ అని జగ్మిత్ సింగ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హత్య అక్టోబర్ 1984లో చోటు చేసుకున్న తర్వాత సిక్కుల హత్యలు చోటు చేసుకున్నాయి. దీనినే కొందరు సిక్కుల ఊచకోతగా అభివర్ణిస్తున్నారు. ఏప్రిల్ 2017లో అంటారియో శాసనసభ ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, ఇది భారత్- కెనడాల మధ్య విభేదాలకు కారణమైంది. అంటారియా శాసనసభ్యుడిగా ఉన్న లిబరల్ పార్టీకి చెందిన హరీందర్ మల్హీ ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు.
వేర్పాటువాద సంస్థ, భారత్లో ఉగ్రవాద సంస్థగా గుర్తింపుపొందిన సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) స్పందిస్తూ.. ఇది సానుకూలదశగా పేర్కొంది. ఇప్పటికే ఖలిస్తాన్ రెఫరెండంతో ఈ సంస్థ భారత్లో విభజనను ప్రోత్సహిస్తోంది. ఇదే డిమాండ్ చేస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(KTF) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు ఏకంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. మరోవైపు మరో ఖలిస్తానీ ఉగ్రవాది ఎస్జేఎఫ్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను భారత్కి చెందిన ఓ వ్యక్తి చంపేందుకు కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చెక్ రిపబ్లిక్లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని అమెరికా తీసుకువచ్చేందుకు ఆ దేశంతో చర్చలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!