CAATSA: అమెరికా ఆంక్షల నుంచి ఇండియాకు మినహాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా లావాదేవీలు నిర్వహించే దేశాలపై విధించే కాట్సా(సీఏఏటీఎస్ఏ) చట్టం నుంచి భారత్ కు మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ చట్టం నుంచి భారత్ ను మినహాయిస్తూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మాణాన్ని గురువారం ఆమోదించింది. ధీంతో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని.. ఇది చైనా దురాక్రమనను అరికట్టడంతో ఉపయోగపడుతుందని అమెరికా చట్ట సభ ప్రతినిధులు భావిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) సవరణల ప్రకారం.. భారతీయ-అమెరికన్, హైజ్ ఆర్మ్డ్ సర్వీసెస్ యాక్ట్ లో సభ్యుడైన డెమొక్రాటిక్ ప్రతినిధి రో ఖన్నా తీర్మాణాన్ని సభ ఆమోదించింది. అయితే ఈ సవరణలు పూర్తిగా చట్టంగా మారాలంటే మాత్రం వివిధ దశల్ని దాటుకొని వెళ్లాలి.
చైనా నుంచి పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్ కు అమెరికా అండగా నిలబడాలని భావిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలు నెరవేరాలంటే భారత్- అమెరికా బంధం కీలకమని అక్కడి ప్రతినిధులు భావిస్తున్నారు. కాట్సా నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపు లభిస్తే అమెరికా శత్రు దేశాలైన రష్యా, ఇరాన్ దేశాలతో భారత్ మరింతగా రక్షణ, వాణిజ్య సంబంధాలను కొనసాగించే అవకాశం లభిస్తుంది. కాట్సా చట్టం ప్రకారం ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా దేశాలతో లావాదేవీలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది.
Also Read
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
Read Also: Telangana Rains: బ్రేక్ తీసుకున్న వరుణుడు.. మళ్ళీ 18 తర్వాత జల్లులు
స్వాతంత్య్రం తరువాత నుంచి ఇండియా ఎక్కువగా రష్యా ఆయుధాలు, సైనిక వ్యవస్థలపైనే ఆధారపడుతోంది. రానున్న రోజుల్లో డిఫెన్స్ కు సంబంధించి యుద్ధవిమానాలు, ఇతర రక్షణ వ్యవస్థల ఆధునీకీకరణపై రష్యాపై భారత్ ఆధారపడి ఉంది. దీంతో పొరుగుల చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్య భారత్ రష్యాతో తన స్నేహాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యుత్తమ క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ రష్యా నుంచి 5.34 బిలియన్ డాలర్ల వ్యయంతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే భారత్ ఈ చర్య వల్ల అమెరికా కాట్సా ఆంక్షల్లోకి వస్తుందని గతంలో పలువురు అమెరికా ప్రతినిధులు హెచ్చరించారు. కాగా భారత్ ఇవేవీ పట్టించుకోకుండా రష్యా నుంచి ఎస్ – 400 కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపింది.
తాజావార్తలు
-
Mega158: బర్త్డే స్పెషల్గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్బస్లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
-
Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
-
Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!