Bulldozer action: ఉదయ్పూర్లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..
- మత ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉదయ్పూర్..
- ఓ వర్గం విద్యార్థి మరో వర్గం విద్యార్థిపై దాడి చేయడంతో ఉద్రిక్తత..
- నిందితుడి అక్రమ ఇంటిని కూల్చివేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bulldozer action: రాజస్థాన్ ఉదయ్పూర్ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 తరగతి విద్యార్థి, తన సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడం నగరంలో ఉద్రిక్తలకు దారి తీసింది. దాడి చేసిన బాలుడు మైనారిటీ వర్గాని చెందడం, గాయపడిన బాలుడు మెజారిటీ వర్గానికి చెందడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పలు హిందూ సంస్థలు మధుబనిలో ఆందోళన నిర్వహించాయి. ఈ ఘటన తర్వాత మత ఉద్రిక్తల్ని పెంచింది. ఈ ఘటనలో పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పటించడంతో పాటు షాపింగ్ మాల్స్పై రాళ్లతో దాడి చేశారు.
Read Also: CM Chandrababu: కాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
ఇదిలా ఉంటే, ఉదయ్పూర్లో దాడికి పాల్పడిన బాలుడి కుటుంబం అక్రమంగా నిర్మించిన ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. దాడికి పాల్పడిన బాలుడి కుటుంబం ఇళ్లు అటవీ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు తేలింది. జిల్లా యంత్రాంగం నిందితుడి కుటుంబానికి చెందిన వస్తువుల్ని తీసుకున్న తర్వాత కూల్చివేత మొదలుపెట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ కొనసాగేలా చూసేందుకు ఘటనా స్థలంలో భారీ పోలీస్ బందోబస్తుని మోహరించారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పలువురు స్థానికులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
నిందితుడు శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. ఇది మధుబన్ ప్రాంతంలో మత ఉద్రిక్తతలకు కారణమైంది. దాడి చేసిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనధికార నిర్మాణాలపై స్థానిక పరిపాలన అధికారులు దృఢమైన వైఖరితో పాటు పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించే ఘటనపై చర్యల్ని హైలెట్ చేస్తోంది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య నగరంలో పోలీస్ బందోబస్తుని పెంచారు. 144 సెక్షన్ విధించడమే కాకుండా, ఒక రోజు పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు.
తాజావార్తలు
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!