India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
- బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు
- సరిహద్దుల్లో కంచె నిర్మాణంపై BSF–BGB మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి
- 4,096 కి.మీ భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా బలగాల మోహరింపు
- బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ దూకుడు వెనుక స్మగ్లింగ్, చొరబాట్ల ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. చాలా ఏళ్లుగా బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సొంతదేశానికి పయణమవుతున్నారు. దీంతో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులకు జనాలు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ సరిహద్దుల్ని రక్షించే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (BGB) సిబ్బందికి నచ్చడం లేదు. దీంతో సరిహద్దుల్లో మన భూభాగంలోనే కంచె నిర్మిస్తున్న భారత సరిహద్దు భద్రతా దళం (BSF)తో ఘర్షణకు దిగుతున్నారు.
బీఎస్ఎఫ్ వర్సెస్ బీజీబీ:
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూ సరిహద్దులలో ఒకటి. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. 4096 కి.మీ సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ వైపు బీజీబీ ఉంటే, మన వైపు బీఎస్ఎఫ్ ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దు దళం మొత్తం బలం 70,000లుగా అంచనా, మన బీఎస్ఎఫ్ బలం 2,70,000.
బీజీబీ దురాక్రమణ ఎందుకు.?
ఇటీవల నెలల్లో భారత్ సరిహద్దుల్లో కంచె నిర్మిస్తుంటే, బీజీబీ తరుచుగా అడ్డుకుంటోంది. భారత్ అంతర్జాతీయ సరిహద్దు నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని వాదిస్తోంది. 150 గజాల నో మ్యాన్స్ ల్యాండ్లో అక్రమంగా కంచె నిర్మిస్తున్నట్లు వాదిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గత కొంత కాలంగా రెండు దళాల మధ్య వందలాది సమావేశాలు జరిగాయి.
ఇటీవల కాలంలో బీజీబీ దూకుడు మరింతగా పెరిగింది. బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని, స్థానిక బంగ్లా ప్రజల సహకారంతో బీఎస్ఎఫ్పై దాడికి ప్రయత్నిస్తోంది. సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ స్మగ్లర్ల రాకపోకలు, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ సరఫరా వంటి వాటికి బీజీబీ సహకరిస్తోంది. ఇప్పుడు కంచె నిర్మిస్తే తమ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఇలాంటి ఘర్షణను కోరుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే సరిహద్దుల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!