BS Yediyurappa: అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తాం: కర్ణాటక మినిస్టర్..
- యడియూరప్పపై కర్ణాకట హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..
- అవసరమైతే అరెస్ట్ చేస్తాం..
- మాజీ సీఎంపై పోక్సో కేసు..
- బాలికను లైంగికం వేధించినట్లు అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BS Yediyurappa: కర్ణాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప కేసు సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రస్తుతం సీఐడీ విభాగం విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణకు హాజరుకావాలని యడియూరప్పకి బుధవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై కొంత సమయం కావాలని ఆయన సీఐడీని కోరారు. తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న విచారణకు హాజరవుతానని సీఐడీ నోటీసుకు యడ్యూరప్ప బదులిచ్చారు. ఇప్పటికే యడియూరప్ప మూడుసార్లు విచారణకు హాజరుకాగా, నాలుగోసారి నోటీసులు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ కేసులో అవసరమైతే యడియూరప్పని అరెస్ట్ చేస్తామని, దీనిపై రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర గురువారం అన్నారు. మరోవైపు అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు రేపు విచారించనుంది.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
Read Also: ఉదయం లేవగానే ఇవి చూస్తున్నారా..?
ఈ కేసు గురించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. ‘‘చట్టం అందరికీ సమానమే.. ఆ ఘటనలో ఏం జరిగినా పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటారు. అతడు దోషి అని నేను అనను కానీ, చట్టానికి అందరూ సమానం. చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదు.’’ అని అన్నారు.
బాలిక తల్లి చీటింగ్ కేసులో సాయం కోరేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యడియూరప్పను కలిసేందుకు వెళ్లగా, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె మార్చి 14న సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం మరియు IPC సెక్షన్ 354A (లైంగిక వేధింపులు) కింద అభియోగాలు మోపారు. అయితే, ఈ ఆరోపణల్ని నిరాధారమైనవిగా యడియూరప్ప తిరస్కరించారు. బీజేపీ నేత అయిన యడియూరప్ప 2008-2011 మధ్య, 2018లో కొంత కాలం, 2019-2021 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!