BS Yediyurappa: అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తాం: కర్ణాటక మినిస్టర్..
- యడియూరప్పపై కర్ణాకట హోం మంత్రి కీలక వ్యాఖ్యలు..
- అవసరమైతే అరెస్ట్ చేస్తాం..
- మాజీ సీఎంపై పోక్సో కేసు..
- బాలికను లైంగికం వేధించినట్లు అభియోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BS Yediyurappa: కర్ణాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప కేసు సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రస్తుతం సీఐడీ విభాగం విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణకు హాజరుకావాలని యడియూరప్పకి బుధవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై కొంత సమయం కావాలని ఆయన సీఐడీని కోరారు. తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న విచారణకు హాజరవుతానని సీఐడీ నోటీసుకు యడ్యూరప్ప బదులిచ్చారు. ఇప్పటికే యడియూరప్ప మూడుసార్లు విచారణకు హాజరుకాగా, నాలుగోసారి నోటీసులు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ కేసులో అవసరమైతే యడియూరప్పని అరెస్ట్ చేస్తామని, దీనిపై రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర గురువారం అన్నారు. మరోవైపు అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు రేపు విచారించనుంది.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: ఉదయం లేవగానే ఇవి చూస్తున్నారా..?
ఈ కేసు గురించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. ‘‘చట్టం అందరికీ సమానమే.. ఆ ఘటనలో ఏం జరిగినా పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటారు. అతడు దోషి అని నేను అనను కానీ, చట్టానికి అందరూ సమానం. చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదు.’’ అని అన్నారు.
బాలిక తల్లి చీటింగ్ కేసులో సాయం కోరేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యడియూరప్పను కలిసేందుకు వెళ్లగా, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె మార్చి 14న సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం మరియు IPC సెక్షన్ 354A (లైంగిక వేధింపులు) కింద అభియోగాలు మోపారు. అయితే, ఈ ఆరోపణల్ని నిరాధారమైనవిగా యడియూరప్ప తిరస్కరించారు. బీజేపీ నేత అయిన యడియూరప్ప 2008-2011 మధ్య, 2018లో కొంత కాలం, 2019-2021 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!