Crime in Uttar Pradesh: ఒకరిపై వేధింపులు.. మరొకరిపై అనుమానం.. యూపీలో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం నసిస్తోంది. అనుమానం పెనుభూతంలా మారుతోంది. అనుమానంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడటంలేదు. ఏంజరుగుతుంది అనుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. ఒకరు వేధిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరి కొందరు ఎదుటివారిపై అనుమానంతో వారి ప్రాణాలు తీసేందుకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా యూపీ మారింది. వరుస ఘటనలతో యూపీ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వితంతువు అయిన తన కోడలిని సుత్తితో కొట్టి చంపినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళ ట్వింకిల్గా గుర్తించారు పోలీసులు. మృతురాలకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. యూపీ.. మీరట్ జిల్లాలోని జానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్పూర్ గ్రామానికి చెందిన గౌరవ్తో ట్వింకిల్కు 2017లో వివాహమైందని, 2021లో ట్రక్కు ప్రమాదంలో ఆమె భర్త మరణించారని సర్కిల్ ఆఫీసర్ లోనీ రజనీష్ ఉపాధ్యాయ్ పోలీసులకు తెలిపారు. అయితే.. భర్త చనిపోవడంతో.. తన కోడలు తరచూ ఫోన్లో మాట్లాడుతుండడం చూసిన నిందితుడు అభిషేక్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం అర్థ రాత్రి అతను అనుకున్న పథకం ప్రకారం మొదటి అంతస్తులోని ఆమె గదికి చేరుకుని విచక్షణా రహితంగా ఆమె తలపై సుత్తితో కొట్టి, శరీరాన్ని పలుచోట్ల కోశాడని పోలీసులు తెలిపారు. అభిషేక్ను అరెస్టు చేసి, ఇంట్లో నుండి ఒక సుత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
read also: Century in 100th ODI Match: వందో మ్యాచ్లో ‘వంద’ చేసిన ఆటగాళ్లు
ఇక యూపీలోనే మరో ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపుల కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు సర్కిల్ అధికారి సునీల్ దత్ తెలిపారు. ఇప్పటి వరకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుంగర్హి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ గ్రామానికి చెందిన బాలిక.. 11వ తరగతి చదువుతుందని, విద్యార్థిని అని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఈసందర్భంలో.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను వెంబడిస్తూ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారని, బాలిక ఎన్నిసార్లు కోరినప్పటికీ ఆ యువకుడు వేధిస్తూనే ఉన్నాడని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సింగ్ తెలిపారు. తల్లిదండ్రుల వద్ద నుంచి ఫిర్యాదు రాగానే.. నిందుతుడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Apple Watch: ‘ఆపిల్ వాచ్’ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!