Bombay High Court: వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయి.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు..
- వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయి..
- చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు..
- అత్తమామలపై పెట్టిన కేసును విచారిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.
‘‘ వివిధ కారణాల వల్ల ఈ రోజుల్లో వివాహ సమస్యలు సమాజంలో ఒక సమస్యగా మారింది. ఈ వివాహ విభేదాల కారణంగా పోరాడుతున్న వారికి చట్టంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న చిన్న సమస్య మొత్తం జీవితాన్ని పాడు చేస్తోంది. హిందువుల్లో పవిత్రమైన వివాహాలు ప్రమాదంలో ఉన్నాయి’’ అని న్యాయమూర్తులు నితిన్ సాంబ్రే, ఎంఎం నెర్లికర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
గృహహింస చట్టం, హిందూ వివాహాల చట్టం, ప్రత్యేక వివాహాల చట్టాలు పలువురు తరుచుగా దుర్వియోగానికి గురి చేస్తున్న ఫలితంగా, కోర్టులపై భారం పడుతోందని కోర్టు చెప్పింది. ఇదే కాకుండా ఈ సమస్యలు మానసిక, శారీరక వేధింపులు, అంతులేని సంఘర్షన, ఆర్థిక నష్టం, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులపై కోలుకోలేని హాని కలిగించే అనేక కేసులు నమోదవుతున్నాయని ధర్మాసనం తెలిపింది.
మే 2023ల వివాహం చేసుకున్న జంట కేసును విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ డిసెంబర్ 2023లో నాగ్పూర్లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టం కింద ఆమె భర్త, ఇద్దరు సోదరిణులు, అత్తామామలపై కేసు నమోదు చేసింది. వరకట్న వేధింపులు, అసహజ లైంగిక సంబంధం,భూమి, ఆస్తి కోసం డిమాండ్ చేసినట్లు ఆమె వారిపై ఆరోపించింది. అయితే, ప్రస్తుతం తమ వివాదాలు అన్ని పరిష్కారమయ్యాయని సదరు మహిళ, ఆమె తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ రద్దు చేయాలని కోరారు. దీనికి హైకోర్టు అంగీకరించింది. భార్యభర్తలు శాంతియుతంగా జీవించాలనుకుంటే, వారిని ప్రోత్సహించడం కోర్టు విధి అని ధర్మాసనం పేర్కొంది.
తాజావార్తలు
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!